Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గురువారం మునగాల మండల పరిధిలోని మాధవరం,రేపాల,కలకోవా, గణపవరం రెవెన్యూ గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారులు,రెవెన్యూ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు నాలుగు టీములుగా ఏర్పడి వ్యవసాయానికి యోగ్యం కానీ భూములను గుర్తించే ప్రక్రియలో ఫీల్డ్ సర్వే విచారణలు జరుపుతున్నారు.

ఈ రైతు భరోసా సర్వే ప్రక్రియను సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు మాధవరం గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించి,ఎలాంటి తప్పులు జరగకుండా సర్వేను ఈ నెల 20 వ తారీకు లోగా 11 రెవెన్యూ గ్రామాలలో పూర్తి చేయాలి అని 21 నుండి 24 వరకు వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను ను అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించి,తుది జాబితా తయారు చేయాలని ఆదేశించడం జరిగింది.

ఈ సర్వే పరిశీలన కార్యక్రమం లో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ,మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో శిరీష,తహసీల్దార్ ఆంజనేయులు,ఎంపీడీవో రమేష్,ఎంఈఓ రాజు,ఏఈఓ భవాని,నాగు,రమ్య,రేష్మ, రెవెన్యూ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.

 

Related posts

సిపిఎం సీనియర్ నాయకులుమరిపెల్లి వెంకన్న ను పరామర్శిన   సిపిఎం పార్టీ వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ

TNR NEWS

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె

TNR NEWS

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లిసైదులు

TNR NEWS

కొమురం భీం జిల్లాలో భూ ప్రకంపనలు…

TNR NEWS

వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించిన ముస్లిం యువకులు

TNR NEWS

ఇండియన్ ఒలంపియాడ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రం అందజేత..

TNR NEWS