Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గురువారం మునగాల మండల పరిధిలోని మాధవరం,రేపాల,కలకోవా, గణపవరం రెవెన్యూ గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారులు,రెవెన్యూ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు నాలుగు టీములుగా ఏర్పడి వ్యవసాయానికి యోగ్యం కానీ భూములను గుర్తించే ప్రక్రియలో ఫీల్డ్ సర్వే విచారణలు జరుపుతున్నారు.

ఈ రైతు భరోసా సర్వే ప్రక్రియను సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు మాధవరం గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించి,ఎలాంటి తప్పులు జరగకుండా సర్వేను ఈ నెల 20 వ తారీకు లోగా 11 రెవెన్యూ గ్రామాలలో పూర్తి చేయాలి అని 21 నుండి 24 వరకు వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను ను అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించి,తుది జాబితా తయారు చేయాలని ఆదేశించడం జరిగింది.

ఈ సర్వే పరిశీలన కార్యక్రమం లో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ,మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో శిరీష,తహసీల్దార్ ఆంజనేయులు,ఎంపీడీవో రమేష్,ఎంఈఓ రాజు,ఏఈఓ భవాని,నాగు,రమ్య,రేష్మ, రెవెన్యూ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.

 

Related posts

టీషర్ట్ లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకుడు

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి చేరికలు

TNR NEWS

కన్నుల పండుగగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం

TNR NEWS

ముఖ్యమంత్రిని కలిసిన మాల మహానాడు అనుమకొండ జిల్లా అధ్యక్షులు  ముప్పిడి శ్రవణ్ కుమార్

TNR NEWS

ప్రజల సమస్యలు వదిలేసి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

TNR NEWS

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే

Harish Hs