Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా పథకంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గురువారం మునగాల మండల పరిధిలోని మాధవరం,రేపాల,కలకోవా, గణపవరం రెవెన్యూ గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారులు,రెవెన్యూ అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు నాలుగు టీములుగా ఏర్పడి వ్యవసాయానికి యోగ్యం కానీ భూములను గుర్తించే ప్రక్రియలో ఫీల్డ్ సర్వే విచారణలు జరుపుతున్నారు.

ఈ రైతు భరోసా సర్వే ప్రక్రియను సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు మాధవరం గ్రామంలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించి,ఎలాంటి తప్పులు జరగకుండా సర్వేను ఈ నెల 20 వ తారీకు లోగా 11 రెవెన్యూ గ్రామాలలో పూర్తి చేయాలి అని 21 నుండి 24 వరకు వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను ను అన్ని గ్రామాల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించి,తుది జాబితా తయారు చేయాలని ఆదేశించడం జరిగింది.

ఈ సర్వే పరిశీలన కార్యక్రమం లో కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ,మండల స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ సీఈవో శిరీష,తహసీల్దార్ ఆంజనేయులు,ఎంపీడీవో రమేష్,ఎంఈఓ రాజు,ఏఈఓ భవాని,నాగు,రమ్య,రేష్మ, రెవెన్యూ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.

 

Related posts

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి  మాదక ద్రవ్యాలు / డ్రగ్స్,గంజాయి సేవిస్తే కఠిన చర్యలు తప్పవు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్

TNR NEWS

మావోయిస్టుల మృత దేహాలను  వారి కుటుంబ సభ్యులకు, బందు మిత్రులకు అప్పచెప్పాలి.  నరమేధాన్ని ఆపాలి  మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి.  ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి.  విలేకర్ల సమావేశంలో వామపక్ష, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్

TNR NEWS

జాన్ పహాడ్ ఉర్సు గంధం ఊరేగింపు ప్రారంభించిన మంత్రి

TNR NEWS

ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్న వితరణ కార్యక్రమం ‌

TNR NEWS

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

TNR NEWS

అక్షర యోధుడు కాళోజి

Harish Hs