Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రీడా వార్తలుతెలంగాణ

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

 

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో ఈ నెల 16, 17, 18 మూడు రోజులపాటు రాత్రిపూట షాటు బాండ్రి క్రికెట్ టోర్నమెంట్ ప్రతి ఒక్కరిని ఆకర్షింప చేశాయి. ప్రతిరోజు రాత్రి వేళల్లో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్ వీక్షించడానికి మండల కేంద్రంలోని వందలాది మంది యువకులు హాజరయ్యారు. మూడు రోజులు జరిగిన ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా నవదుర్గ గణేష్ మండలి టీం గెలుపొందింది. రెండవ బహుమతిగా వెంకటేశ్వర గణేష్ మండలి టీం గెలుచుకుంది. గెలుపొందిన జట్లకు గ్రామ పెద్దలు ఆల్ పార్టీల నాయకులు పాల్గొని బహుమతులను అందజేశారు. రాత్రి వేళల్లో షాటు బాండ్రి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన నిర్వాహకులకు గ్రామ పెద్దలు యువకులు అభినందించారు. ఈ ముగింపు కార్యక్రమంలో డాక్టర్ బండి వార్ విజయ్ చౌలవార్ హనుమాన్లు స్వామి రమేష్ కృష్ణ పటేల్ అజయ్ తమ్మే వార్ నాగేష్ సక్కర్ల వార్ తదితరులతో పాటు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

Related posts

విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయం

Harish Hs

ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు ● ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బీఆర్ఎస్ నాయకులు

TNR NEWS

కలెక్టర్ ని కలిసిన శ్రీకాంత్ రావు

TNR NEWS

కాంగ్రేస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు KGKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

TNR NEWS

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

TNR NEWS

ప్రవేట్ టీచర్లకు గుర్తింపు, హెల్త్ కార్డులు ఇవ్వాలి – టిపిటిఎల్ఎఫ్ డిమాండ్

TNR NEWS