డిసెంబర్ 2 న మిర్యాలగూడలో సిపిఎం జిల్లా మహాసభల సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి సిపిఎం మండల కార్యదర్శి మన్యం బిక్షం పిలుపునిచ్చారు
బుధవారం తిప్పర్తి మండల కేంద్రంలో నర్రా రాఘవరెడ్డి భవన్లో సిపిఎం జిల్లా మహాసభల కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 2.3.4 తేదీలలో సిపిఎం నల్లగొండ జిల్లా 21వ మహాసభలు మిర్యాలగూడలో జరుగుతున్నాయని రెండో తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని దానికి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది మహాసభలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి రానున్న కాలంలో పోరాటాలను ఉధృతం చేస్తున్నందుకు ఈ మహాసభ వేదిక కానున్నదని అన్నారు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు హామీలు అమలు చేయకుండా పక్కదారి పట్టిస్తున్నారని హామీల అమలు కోసం ప్రతి ఒక్కరు పోరాటాలకు రావాలని రానున్న కాలంలో ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు భీమగాని గణేష్, గండమళ్ళ రాములు ,ఆకటి లింగయ్య, జంజీరాల సైదులు ,పోకల శశిధర్ ,మంత్రాల మంగమ్మ, చెనగోని వెంకన్న ,జంజీరాల ఉమా ,మాలే భార్గవి ,మాలి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Save or share this story as a newspaper-style Epaper Clip:
