Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజాసేవకు విరమణ ఉండదు

పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని గుడుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో కోదాడ మున్సిపల్ పాలకవర్గం ముగుస్తున్న సందర్భంగా చైర్మన్ సామినేని ప్రమీల ఆధ్వర్యంలో వారిని శాలువా పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం అన్ని విధాలుగా కృషి చేసిందని గత ఐదు సంవత్సరాలుగా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఎంతో కష్టపడి పనిచేశారని ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. కరోనా మహమ్మారి, ఇటీవల వచ్చిన వరదల్లో మున్సిపల్ అధికారులు, పాలకవర్గం, పారిశుద్ధ్య కార్మికులు తమ శక్తి వంచన లేకుండా అన్ని విధాలుగా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పట్టణ ప్రజల మన్ననాలను పొందారన్నారు. ప్రజాసేవకు విరమణ ఉండదు అని పదవి ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏవైనా సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తప్పక పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, కమిషనర్ రమాదేవి పాలకవర్గ సభ్యులు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు………..

Related posts

*ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం*

TNR NEWS

ప్రజా పాలన కళాయాత్ర ప్రారంభం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డిసెంబర్ -7 దాకా కొనసాగనున్న కళాయాత్ర ఉత్సవాలు

TNR NEWS

లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేత

TNR NEWS

*సేవాలాల్ మహారాజ్ జయంతిని విజయవంతం చేయాలి

TNR NEWS

జిన్నారంలో గుట్టపై భక్తుల సందడి 

TNR NEWS

కార్మికుని కుటుంబానికి సహాయం చేసిన అమ్మాపురం గ్రామస్తులు 

TNR NEWS