Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని సోమవారం ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఏపీవో శ్రీనివాస్ పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలావుందీ అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడుతూ విద్యార్థులు తినే భోజనం వండే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు తెలిపారు. భోజనం నాణ్యత విషయంలో ఎటువంటి ఫిర్యాదులు వచ్చిన ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు.ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని విద్యార్ధులకు అందించాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Related posts

ప్రభుత్వ పథకాలపై కళాకారుల ఆటపాట వివిధ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్న కళాకారులు

TNR NEWS

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి

TNR NEWS

ప్రజాసేవకు విరమణ ఉండదు

Harish Hs

బకాయి కట్టకుంటే కరెంట్ కట్… బిల్లులు సకాలం చెల్లించాలి…

TNR NEWS

గ్రామ సభలకు కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తారు మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి 

TNR NEWS

రాష్ట్ర స్థాయి పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థులు 

TNR NEWS