Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎంపీడీవో

మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ లో మధ్యాహ్న భోజనాన్ని సోమవారం ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్,ఏపీవో శ్రీనివాస్ పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలావుందీ అని అడిగి తెలుసుకున్నారు.అనంతరం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో మాట్లాడుతూ విద్యార్థులు తినే భోజనం వండే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు తెలిపారు. భోజనం నాణ్యత విషయంలో ఎటువంటి ఫిర్యాదులు వచ్చిన ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు.ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. ప్రభుత్వ మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని విద్యార్ధులకు అందించాలని సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Related posts

విజ్ఞాన కేంద్రం స్థాపన కోసం భూమి కేటాయించలి  :- సీఎంకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ 

TNR NEWS

మెడికల్ షాప్ అసోసియేషన్ మండల అధ్యక్షుడుగా సుమన్

Harish Hs

పర్యాటక కేంద్రంగా ‘సింగూరు’ ఆందోల్‌లోని పలు విద్యా సంస్థల్లో పర్యటించిన మంత్రి దామోదర

TNR NEWS

ఎమ్మార్పీఎస్ మహిళ జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా వనిత 

TNR NEWS

ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

TNR NEWS

సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అధికారిక ఉత్తర్వులు జారీ

TNR NEWS