Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆరోగ్యం వైద్యంతెలంగాణ

క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి కే సురేష్ అన్నారు. సోమవారం కోర్టు ఆవరణలో ఫిబ్రవరి 4 అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో వైద్యులు డాక్టర్ గంటా నాగమణి, డాక్టర్ జూకూరి సంజవ్ కుమార్ తో కలిసి న్యాయవాదులకు, కోర్టు సిబ్బందికి, కక్షిదారులకు క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. మన శరీరంలో జరిగే మార్పులను గమనించుకుంటూ తరచూ డాక్టర్లను సంప్రదించి పరీక్షలు చేపించుకోవాలన్నారు. క్యాన్సర్ వ్యాధి ముదరకముందే ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని తెలిపారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వేకల్ క్యాన్సర్ల గురించి వివరించారు. పురుషుల్లో ధూమపానం, మద్యపానం, పొగాకు, మత్తుపదార్థాలు వాడటం వ్యాయామం లేకపోవడం వంటి అలవాట్ల వలన క్యాన్సర్ మహమ్మారి సోకుతుందన్నారు. సరైన జీవనశైలితో జీవన విధానంలో మార్పులతో క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. క్యాన్సర్ వ్యాధిపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చిత్తలూరి సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఆర్ కె మూర్తి, ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు, కె.వి చలం, దొడ్డ శ్రీధర్, ఉయ్యాల నరసయ్య, మురళి, మోష, దావీద్, మంద వెంకటేశ్వర్లు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు………

Related posts

విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయం

Harish Hs

కోదాడ లో మొట్ట మొదటి మల్టీ బ్రాండ్ ఆఫ్టికల్ స్టోర్ సిటి ఆప్టికల్స్

Harish Hs

ప్రతి విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకోవాలి సిఐ జగడం నరేష్

TNR NEWS

మహా మండల పూజలు విజయవంతం చేయాలి… ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్య

TNR NEWS

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

TNR NEWS

ల్యాండ్ సర్వే జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

TNR NEWS