Tnrnews.in
ఆంధ్రప్రదేశ్రాజకీయం

ఉప ముఖ్యమంత్రి పవన్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే పెండెం

పిఠాపురం : జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం నియోజవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు భేటీ అయ్యారు. సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పెండెం దొరబాబు తమ కుటుంబ సభ్యులతో కలసి పవన్ కళ్యాణ్ తో చర్చించారు. జనసేన పార్టీలో చేరేందుకు పెండెం దొరబాబు ఆసక్తి వ్యక్తం చేయగా అందుకు పవన్ కళ్యాణ్ అంగీకారం తెలిపారని పార్టీ కేంద్ర కార్యాలయం తమ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. మార్చి 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరగబోయే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో పార్టీ కండువా కప్పుకోనున్నట్టు విశ్వసినీ వర్గాలు సమాచారం.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కంపు వాసన నరకయాతన… * డ్రైనేజీ కాల్వల తలపిస్తున్న సిసి రోడ్డు * నడవలేని స్థితిలో వార్డు ప్రజలు * సంవత్సరాలు గడుస్తున్న పట్టించుకోని అధికారులు 

TNR NEWS

ఉపాధికార్డులున్న కూలీలందరికీ ఇందిరమ్మ భరోసా కింద 12000 ఇవ్వాలి.          పంజాల రమేష్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు 

TNR NEWS

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra

రైతు. కార్మిక హక్కుల పరిరక్షణకై నవంబర్ 26న జరిగేమోటార్ సైకిల్ ర్యాలీని జయప్రదం చేయండి.

TNR NEWS

జనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

Dr Suneelkumar Yandra

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs