Tnrnews.in
తెలంగాణ

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

ఆరుకాలం ఎంతో కష్టపడి పండించిన వరి పంటకు కనీస మద్దతు ధర రావట్లేదని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం రాశికి నిప్పు పెట్టిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. కోదాడ నియోజకవర్గ మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామానికి చెందిన బత్తుల లింగరాజు అనే రైతు 5 ఎకరాలు కౌలుకు చేసి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ‌కు 70 బస్తాల ధాన్యం తీసుకురాగా.. అతి తక్కువ ధర 1600 రూపాయలు పలకడంతో పెట్టిన పెట్టుబడి కూడా సరిగా రాలేదని రైతు ఆవేదన చెందాడు. దీంతో తాను తీసుకువచ్చిన ధాన్యం రాశికి నిప్పు అంటించి తగలబెట్టాడు. రెండు రోజులుగా అన్నం తినకుండా ధాన్యం రాశి వద్దే పడుకున్నానని.. కనీసం మద్దతు ధర కూడా రాకపోతే బ్రతికేది ఎలాగని అధికారులను ప్రశ్నించిన రైతు..

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఈ నెల 20 తర్వాత వర్షాలకు ఛాన్స్…!

TNR NEWS

రోడ్డు ప్రమాదంలో ఆలమూరు ఎస్సై మృతి

TNR NEWS

సూర్యాపేట జిల్లాకు కామ్రేడ్ ధర్మబిక్షం పేరు పెట్టాలి

TNR NEWS

జాబితాపూర్ అట్టహాసంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.  మాజీ ఎంపీటీసీ చిత్తరి స్వప్న శ్రీనివాస్

TNR NEWS

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా ఫేర్వెల్ డే సంబరాలు

TNR NEWS