May 12, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

చదువుతోపాటు నైపుణ్యం అవసరం

విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించి గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ లు ఎంతో దోహదపడుతుందని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ తెలిపారు. బుధవారం పట్టణంలోని పీఎం శ్రీ బాయ్స్ హై స్కూల్ నందు కోదాడ, హుజూర్నగర్ రెండు డివిజన్ల పరిధిలోని పీఎం శ్రీ పాఠశాలల సైన్సు మరియు గణిత ఉపాధ్యాయులు 36 మందికి రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమ ముగింపు సందర్భంగా వారి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు చక్కటి గుణాత్మక విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయలతో ల్యాబ్ ను ఏర్పాటు చేసింది అన్నారు. నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ల్యాబ్ లు దోహదం చేస్తాయన్నారు.జిల్లా సైన్స్ అధికారి లామ్ దేవరాజు మాట్లాడుతూ విద్యార్థులలో సైన్సు ఆసక్తిని పెంచి భావి భారత శాస్త్రవేత్తలుగా, ఆవిష్కర్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ లను ఏర్పాటు చేసిందన్నారు. రిసోర్స్ పర్సన్స్ కిషన్,ప్రశాంత్, రఘు లు రెండు రోజులపాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ, హుజూర్నగర్ సైన్స్,గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు………

Related posts

బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు

TNR NEWS

చదువుల సరస్వతి సావిత్రిబాయి పూలే 

TNR NEWS

వృద్ధురాలికి దహన సంస్కారాలు నిర్వహించిన ముస్లిం యువకులు

TNR NEWS

భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులది ‌

TNR NEWS

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ 

TNR NEWS

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

TNR NEWS