Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ఐదేళ్ళలో కోటిమందిని కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం : డాక్టర్ రామ్మూర్తియాదవ్*… *కాంగ్రెస్ విజయోత్సవ సభకు వరంగల్ తరలిన కాంగ్రెస్ నాయకులు

 

ఐదేళ్లలో కోటి మందిని కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఉండ్రగొండ లక్ష్మి నర్సింహ్మస్వామి దేవస్థాన చైర్మన్ డాక్టర్ రామ్మూర్తియాదవ్ అన్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్నందున వరంగల్లో మంగళవారం నిర్వహించిన ఇందిర మహిళా శక్తి సభకు సూర్యాపేట నుంచి 2000ల మంది కార్యకర్తలు తరలివెళుతున్న సందర్భంగా వాహనాలకు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజునే మహిళలకు ఉచిత బస్సును ఏర్పాటు చేసి 105కోట్ల మంది ఉచిత ప్రయాణం చేయగా 7,290బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఉచిత సిలిండర్లను 43మంది లక్షల మంది ఉపయోగించుకోగా 3,500ల కోట్లు కేటాయించామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 3 పరీక్షలను ఎలాంటి పేపర్ లీకేజీలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. విదేశాల నుంచి 35వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ముక్యమంత్రి రేవంత్రెడ్డి నూతన కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. కాలేశ్వరం చుక్క నీరు వాడకుండా ఈ ఏడాది వరి సాగు అధికంగా చేశారని అన్నారు. పదేళ్ళలో బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే 72వేల కోట్ల అప్పును కాంగ్రెస్ ప్రబుత్వం ఇప్పటి వరకు తీర్చిందన్నారు. దేశంలో కాంగ్రెస్లో రాహుల్, ప్రియాంక గాంధీ తరువాతి స్థానం రేవంత్రెడ్డికే దక్కుతుందన్నారు. చరిత్రలో ఎవరూ చేయలేని కుల గణనను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి చేస్తున్నారని ఇది పూర్తయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వెలుగు వెంకన్న, షఫీ ఉల్లా, సీనియర్ నాయకులు ముదిరెడ్డి రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్, నిమ్మల వెంకన్న, పిల్లల రమేష్ నాయుడు, వల్గాస్ దేవేందర్, పిల్లల రమేషానాయుడు, తండు శ్రీనివాస్ గౌడ్, బైరబోయిన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Related posts

ఉచిత విద్యుత్ కోసం కొత్త రేషన్ కార్డుదారులు ఇలా చేయండి

TNR NEWS

గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో అడిషనల్ కలెక్టర్ రాంబాబు

Harish Hs

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి  జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 

TNR NEWS

వర్గల్ క్షేత్రంలో… వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు  – ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం  – విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం

TNR NEWS

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించండి.   ప్రశ్నించే గొంతులకు పట్టం కట్టండి.  కలిసివచ్చే లౌకిక శక్తులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం…. సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

కార్యకర్తలను కలుపుకొని బిజెపిని గెలుపు తీరాలకు చేరుస్తా… -పెద్దపల్లి మండల నూతన అద్యక్షుడు రమేష్

TNR NEWS