Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం సాహితీ వేత్తకు అభినందన సత్కారం

పిఠాపురం : యువ సాహితీవేత్త, సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ కోఆర్డినేటర్, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, పిఠాపురం యువ కవి డాక్టర్ కిలారి గౌరీ నాయుడుకి విశాఖపట్నంలో అభినందన సత్కారం జరిగింది. విశాఖపట్నంలోని రాసి కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సత్కారం జరిగింది. రాసి కేర్ ఫౌండేషన్ ప్రతినిధులు సుహాసిని, ఆనంద్, గౌరీ నాయుడునీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. సాహిత్య, సంగీత, సాంస్కృతిక, కళా, రంగాలలో గౌరీ నాయుడు చేస్తున్న విశేషమైన సేవలను గుర్తించి సత్కరించడం జరిగిందని సంస్థ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గౌరీ నాయుడు మాట్లాడుతూ ఒక వ్యక్తికి మాతృభాష గుర్తింపునిస్తుందని, భాషాపటిమతో మాతృభాషలో సామర్థ్యాన్ని సంపాదిస్తే మరి ఏ ఇతర భాషలోనైనా సులభంగా నేర్చుకోవచ్చునని పేర్కొన్నారు. నన్నయ సహస్రబ్ది ఉత్సవాలు నిర్వహించిన సంస్థ సత్కరించడం ఆనందంగా ఉందని గౌరీ నాయుడు తెలిపారు. సత్కరించి

Related posts

మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలి

నిద్రావస్థలో పిఠా‘‘పుర’’ం శానిటేషన్‌  – పట్టించుకోని అధికారులు – రోగాల బారిన ప్రజలు నానాఅవస్థలు – స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు అభ్యర్ధన

TNR NEWS

ఉచితంగా చికెన్‌, కోడి గుడ్లు పంపిణీ

Dr Suneelkumar Yandra

కార్పోరేషన్ ఖజానా గుల్ల చేస్తున్న టెన్నిస్ కోర్టులు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra

నిండ్ర చక్కెర ఫ్యాక్టరీ వద్ద లారీల ఢీ

TNR NEWS

ప్రజలు మెచ్చి గెలిపించిన ప్రజల మనిషి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

TNR NEWS