Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం సాహితీ వేత్తకు అభినందన సత్కారం

పిఠాపురం : యువ సాహితీవేత్త, సోమ సుందర్ లిటరరీ ట్రస్ట్ కోఆర్డినేటర్, రాచకొండ నరసింహ శర్మ సాహితీ సంస్థ ఉపాధ్యక్షుడు, పిఠాపురం యువ కవి డాక్టర్ కిలారి గౌరీ నాయుడుకి విశాఖపట్నంలో అభినందన సత్కారం జరిగింది. విశాఖపట్నంలోని రాసి కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సత్కారం జరిగింది. రాసి కేర్ ఫౌండేషన్ ప్రతినిధులు సుహాసిని, ఆనంద్, గౌరీ నాయుడునీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు. సాహిత్య, సంగీత, సాంస్కృతిక, కళా, రంగాలలో గౌరీ నాయుడు చేస్తున్న విశేషమైన సేవలను గుర్తించి సత్కరించడం జరిగిందని సంస్థ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గౌరీ నాయుడు మాట్లాడుతూ ఒక వ్యక్తికి మాతృభాష గుర్తింపునిస్తుందని, భాషాపటిమతో మాతృభాషలో సామర్థ్యాన్ని సంపాదిస్తే మరి ఏ ఇతర భాషలోనైనా సులభంగా నేర్చుకోవచ్చునని పేర్కొన్నారు. నన్నయ సహస్రబ్ది ఉత్సవాలు నిర్వహించిన సంస్థ సత్కరించడం ఆనందంగా ఉందని గౌరీ నాయుడు తెలిపారు. సత్కరించి

Related posts

సాహసాలు, పోరాటాలు, త్యాగాల ప్రతిరూపమే ‘జయకేతనం’

Dr Suneelkumar Yandra

చిల్లపల్లి శ్రీనివాసరావుని కలిసిన మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్లు

Journalist Ratnam

ఘనంగా మల్లు స్వరాజ్యం మూడోవ వర్ధంతి

Dr Suneelkumar Yandra

మార్చి 3న భద్రాద్రి పాదయాత్ర రామాలయ విగ్రహా ప్రతిష్ట

Dr Suneelkumar Yandra

గత అయిదేళ్లలో రాష్ట్రంలో నీటిశుద్ధి ఫిల్టర్ బెడ్లను మార్చిన పాపాన పోలేదు*

TNR NEWS

జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ

Dr Suneelkumar Yandra