Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు

కాకినాడ : ఏడుకొండల స్వామి ఆరాధకులు గోవింద గోవిందా అంటూ అలిపిరి నుండి కాలినడకన తిరువేంకటగిరికి దారి చూపిన గోవిందుని పాదాలు బ్రహ్మ కడిగిన పరమపద పాదాలని తిరుమల పాదయాత్ర గురుస్వామి స్వయంభు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. పాదయాత్ర పూర్తి చేసి చేపట్టిన108 వారాల జపయజ్ఞ పారాయణ సందర్భంగా కాకినాడ సూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలో వేంచేసియున్న భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం 74వ వ్రత ఆరాధనగా శివకేశవులకు శ్రీముఖ పూజలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారి భక్తులు సుప్రభాత వేళలో సామూహికంగా చేసిన సహస్ర గోవింద నామ పారాయణ అలరించింది. శివపూజ బియ్యాన్ని పంపిణీ చేసారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది రోజున 1008 శ్రీవారి పాదాల కలర్ ఫోటో ప్రింట్ కార్డులు పంపిణీ చేస్తామని పీఠం నిర్వాహకులు తెలియజేసారు.

Related posts

స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణదిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ – జిల్లా కార్యదర్శి జ్యోతుల శ్రీనివాసు

మాదక ద్రవ్యాలు మీద అవేర్నెస్ క్యాంపు యువతకి చాలా ఉపయోగకరం – పట్టణ సిఐ జి.శ్రీనివాస్

Dr Suneelkumar Yandra

చారిత్రక కాకినాడ పురపాలక భవనాన్ని పరిరక్షించాలి – పౌర సంక్షేమ సంఘం వినతి

లస్కర్లకు రెయిన్ కోట్లు అందజేసిన డెల్టా ఛైర్మెన్ మురాలశెట్టి సునీల్

Dr Suneelkumar Yandra

ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది – వైయస్సార్సిపి పిఠాపురం ఇంఛార్జ్ వంగా గీత

Dr Suneelkumar Yandra

గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తాదాన శిబిరం

Dr Suneelkumar Yandra