కాకినాడ : ఏడుకొండల స్వామి ఆరాధకులు గోవింద గోవిందా అంటూ అలిపిరి నుండి కాలినడకన తిరువేంకటగిరికి దారి చూపిన గోవిందుని పాదాలు బ్రహ్మ కడిగిన పరమపద పాదాలని తిరుమల పాదయాత్ర గురుస్వామి స్వయంభు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. పాదయాత్ర పూర్తి చేసి చేపట్టిన108 వారాల జపయజ్ఞ పారాయణ సందర్భంగా కాకినాడ సూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలో వేంచేసియున్న భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం 74వ వ్రత ఆరాధనగా శివకేశవులకు శ్రీముఖ పూజలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారి భక్తులు సుప్రభాత వేళలో సామూహికంగా చేసిన సహస్ర గోవింద నామ పారాయణ అలరించింది. శివపూజ బియ్యాన్ని పంపిణీ చేసారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది రోజున 1008 శ్రీవారి పాదాల కలర్ ఫోటో ప్రింట్ కార్డులు పంపిణీ చేస్తామని పీఠం నిర్వాహకులు తెలియజేసారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
