Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు

కాకినాడ : ఏడుకొండల స్వామి ఆరాధకులు గోవింద గోవిందా అంటూ అలిపిరి నుండి కాలినడకన తిరువేంకటగిరికి దారి చూపిన గోవిందుని పాదాలు బ్రహ్మ కడిగిన పరమపద పాదాలని తిరుమల పాదయాత్ర గురుస్వామి స్వయంభు భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. పాదయాత్ర పూర్తి చేసి చేపట్టిన108 వారాల జపయజ్ఞ పారాయణ సందర్భంగా కాకినాడ సూర్యారావు పేట దూసర్లపూడి వారి వీధిలో వేంచేసియున్న భోగి గణపతి పీఠంలో శనివారం ఉదయం 74వ వ్రత ఆరాధనగా శివకేశవులకు శ్రీముఖ పూజలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. శ్రీవారి భక్తులు సుప్రభాత వేళలో సామూహికంగా చేసిన సహస్ర గోవింద నామ పారాయణ అలరించింది. శివపూజ బియ్యాన్ని పంపిణీ చేసారు. విశ్వావసు నామ సంవత్సర ఉగాది రోజున 1008 శ్రీవారి పాదాల కలర్ ఫోటో ప్రింట్ కార్డులు పంపిణీ చేస్తామని పీఠం నిర్వాహకులు తెలియజేసారు.

Related posts

గ్రామీణ ప్రాంతాలలో మందకోడిగా సాగుతున్న ఉపాధిహామీ పనులు

Dr Suneelkumar Yandra

స్వరూపానంద కు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం..

TNR NEWS

రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న కె.నాగబాబు

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

ఘనంగా వేములపాటి జన్మదిన వేడుకలు

Dr Suneelkumar Yandra

శ్రీవారి అలిపిరి కాలి బాటకు ఇనుపకంచె నిర్మించాలి – రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డు 54వ ధర్మకర్తలమండలికి కాకినాడ భోగిగణపతి పీఠం వినతిపత్రం

Dr Suneelkumar Yandra