Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,74,660/-

పిఠాపురం : దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం పాదగయా క్షేత్రంలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం వారి హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సిఎఫ్‌ఓ సిహెచ్‌.రామ్మోహనరావు, ఇన్స్పెక్టర్‌ వడ్డి ఫణీంద్ర కుమార్‌, జోగా సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకుని 17 రోజులకుగాను రూ.11,74,660/-లు హుండీ ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సర హుండీ అదాయంతో చూస్తే ఈసారి ఆదాయం బాగా పెరిగిందని ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, అర్చకులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం

TNR NEWS

స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్

ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గాలు ఏర్పాటు చేసిన న్యాయవాది గౌరీమణి

Dr Suneelkumar Yandra

కాకినాడ రూరల్ బాధితుడికి సిఎం సహాయనిధి కల్పించాలి

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సినిమా ట్రైలర్ ఆవిష్కరణ

TNR NEWS

పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పండుగ