Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,74,660/-

పిఠాపురం : దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన పిఠాపురం పాదగయా క్షేత్రంలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం వారి హుండీ లెక్కింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. సిఎఫ్‌ఓ సిహెచ్‌.రామ్మోహనరావు, ఇన్స్పెక్టర్‌ వడ్డి ఫణీంద్ర కుమార్‌, జోగా సత్యనారాయణ పర్యవేక్షణలో ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మహాశివరాత్రి పురస్కరించుకుని 17 రోజులకుగాను రూ.11,74,660/-లు హుండీ ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. గత సంవత్సర హుండీ అదాయంతో చూస్తే ఈసారి ఆదాయం బాగా పెరిగిందని ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్త బృందం, బ్యాంకు సిబ్బంది, పోలీసు సిబ్బంది, అర్చకులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జామియా మసీదు వద్ద జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు పూర్తి చేయాలి – సిఎం హామీ పూర్తి చేయాలి

Dr Suneelkumar Yandra

ఏపీలో కొత్తగా నాలుగు లేన్ల హైవే.. ఆ రూట్లోనే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

TNR NEWS

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

TNR NEWS

మాదక ద్రవ్యాలు మీద అవేర్నెస్ క్యాంపు యువతకి చాలా ఉపయోగకరం – పట్టణ సిఐ జి.శ్రీనివాస్

Dr Suneelkumar Yandra

వైయస్సార్ పార్టీకి బాలిపల్లి రాంబాబు రాజీనామా

ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు – ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం..!!

TNR NEWS