Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ పార్టీకి బాలిపల్లి రాంబాబు రాజీనామా

పిఠాపురం : పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయాల కన్వీనర్ల కో-అర్డినేటర్, అర్బన్ సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ బాలిపల్లి రాంబాబు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయం, జిల్లా అధ్యక్షులకు పంపినట్లు ఆయన తెలిపారు. 2019 నుంచి ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు సచివాలయాల కన్వీనర్ల్ కో-ఆర్డినేటర్ గా విధులు నిర్వహించి పార్టీ మన్ననలు పొందారు. 2024 ఎన్నికలలోనూ పార్టీ విజయానికి విశేషంగా కృషి చేశారు. పార్టీ ఇన్ ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును తప్పించి మాజీ ఎంపీ వంగా గీతను నియమించడంపై మనస్థాపంతో ఎన్నికల అనంతరం పార్టీకి దూరంగా వున్నారు. ఈ సందర్భంగా బాలిపల్లి రాంబాబు మాట్లాడుతూ ప్రస్తుత పిఠాపురం నియోజవర్గ  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి వంగా గీత వైఖరితో విసిగి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో ఎంత కష్టపడినా గుర్తింపు లేదన్నారు. ఎన్నికల సమయంలోనూ క్షేత్ర స్థాయి కార్యకర్తలు, నాయకులను పక్కన పెట్టారని ఆయన విమర్శించరు. మాజీ ఎమ్మెల్యే దొరబాబు వెంట జనసేనలో చేరనున్నట్లు ఆయన చెప్పారు.

Related posts

అయినవిల్లి విఘ్నేశ్వరాలయంలో అడ్డగోలు దోపిడి

Dr Suneelkumar Yandra

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయిన విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

TNR NEWS

సంక్రాంతి విశిష్టత ఏమిటి.. పెద్ద పండుగ ఎలా అయ్యింది !

Harish Hs

పవన్ కళ్యాణ్ సంకల్పం… పిఠాపురం రైతాంగంలో ఆనందం

Dr Suneelkumar Yandra

జనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

Dr Suneelkumar Yandra

విద్యుత్ టారిఫ్ బాదుడు వలన ధరలు మరింత పెరుగుతాయి

Dr Suneelkumar Yandra