May 17, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

జైలు జీవితం అంటే – ఏంటో తెలియజేసి రాజీ కుదర్చడమే ఆయన లక్ష్యం    ఎన్.విజయ్ కుమార్ గద్వాల జిల్లా కోర్ట్ న్యాయవాది

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణానికి చెందిన అడ్వకేట్ ఎన్.విజయ్ కుమార్,గద్వాల జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నాడు.సమాజంలో సాధారణ ప్రజలకు చట్టాలు అంటే ఏంటో తెలియని పరిస్థితులలో గోరుతోనే పోయే పరిష్కారాలు గొడ్డలితో మాత్రమే పరిష్కారం అవుతాయి అనే మూర్కపు ఆలోచనలతో,కుటుంబాల బంధాల విలువలు తెలుసుకోకుండా, ఆవేశంతో చిన్నచిన్న తగాదాలతో పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అవుతుండడం చూసి, అడ్వకేట్ విజయ్ కుమార్ స్వయంగా అభాగ్యుల దగ్గర చెంతకు చేరి తెలిసి తెలియని పొరపాట్లకు జైలు జీవితం అంటే ఏంటో,చట్టాలు అంటే ఏంటో క్షుణ్ణంగా కక్షిదారులకు వివరించి రాజీ కుదర్చడమే ఆయన లక్ష్యం. కక్షిదారులు ప్రేమతో సహకరిస్తే తప్ప ,ఏనాడు డబ్బులు తీసుకోడని,రాజీ పడిన ప్రజల నుండి ప్రశంసలు,అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

 

అడ్వకేట్ విజయ్ కుమార్ విధుల పట్ల ప్రజల నుండి వస్తున్న విశేష స్పందన చూసి న్యూస్ రిపోర్టర్ వివరణ అడుగగా, అడ్వకేట్ విజయ్ కుమార్ స్పందించి మాట్లాడుతూ…. గ్రామీణ ప్రాంతాలలో అమాయక ప్రజలు వారి ఆర్థిక పరిస్థితుల వల్ల సమాజంలో చదువుకి దూరమై, చదువు విలువ తెలుసుకోకుండా, చట్టాల పట్ల అవగాహన లేకపోవడంతో పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అవుతుండడం చూసి,వారు చేసిన తప్పులకు జైలు జీవితాలు గడుపుతుండడం చూసి తన దగ్గరికి వచ్చిన వారికి అన్ని అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ, ఒక్కోసారి తనే స్వయంగా బాధితుల దగ్గరికి వెళ్లి చట్టాల పట్ల అవగాహన కల్పిస్తూ, రాజి కుదర్చడంతో వారి కళ్ళల్లో ఆనందభాష్పాలు,సంతోషాలు చూడడమే నా లక్ష్యం అని అన్నారు. సమాజంలో ఏ పరిస్థితుల వల్ల వాళ్లు చదువుకు దూరమయ్యారో,వారి లాంటి పరిస్థితులు వారి పిల్లలకు రాకూడదని వారి పిల్లలను గొప్పగా చదివించండి అంటూ అవగాహన కల్పిస్తున్నానని మీడియాతో తెలియజేశారు.

Related posts

రేపాల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు డీసీపీ నీ ఆహ్వానించిన ఆలయ చైర్మన్

TNR NEWS

రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను అందించాలి

Harish Hs

అర్హులకు పథకాలు అందేలా సర్వే చేయాలి  అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత 

TNR NEWS

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతరావు

TNR NEWS

హలో జర్నలిస్టు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి హైదరాబాద్ సచివాలయం మీడియా పాయింట్ వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేసిన టిఎస్ జేఏ నాయకులు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేంతవరకు ఉద్యమిస్తూనే ఉంటాం రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

TNR NEWS

ఘనంగా సావిత్రీ బాయి పూలే జయంతి వేడుకలు

TNR NEWS