Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

వడ్డాది నుండి గంధవరం వరకు ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం పనులు కొద్దిరోజుల్లోనే ప్రారంభం

పిఠాపురం : దీర్ఘకాలిక సమస్య అయిన వడ్డాది నుండి  గంధవరం వరకు ఉన్న ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం ఆలస్యం అవడం వలన క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ దృష్టికి  చోడవరం జనసేన పార్టీ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు తీసుకువెళ్లారు. అనకాపల్లి కార్యాలయంలో పార్లమెంటు సభ్యులను కలసి ఈ రహదారి దుస్థితి వలన ప్రజలు పడుతున్న ఇక్కట్లు, తరచు జరుగుతున్న ప్రమాదాలవలన అనేకమంది తీవ్ర గాయాలు పలగడం, ప్రాణాలు కోల్పోవడాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్లారు. వెనువెంటనే సిఎం రమేష్ ఆర్ & బి శాఖ ఉన్నత అధికారులతోను మరియు కాంట్రాక్ట్ తీసుకొన్న కంపెనీ యజమాన్యంతోను సుధీర్గంగా చర్చించి వెంటనే రహదారి నిర్మాణం పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన కాంట్రాక్టు యాజమాన్యం రెండు వారాల్లో పనులు ప్రారింభిస్తామని తెలియచేసారు. ఈ ప్రధాన సమస్యపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న సిఎం రమేష్ కి చోడవరం నియోజకవర్గ ప్రజల తరఫున జనసేన పార్టీ కృతజ్ఞతలు తెలియచేస్తుందన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు పాల్గొన్నారు.

Related posts

టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది*

TNR NEWS

వడగండ్ల వర్షాలు మరియు వర్షాలు కోస్తా, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు ముందుంది

Dr Suneelkumar Yandra

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు – జిల్లా కలెక్టర్ షణ్మోహన్

Dr Suneelkumar Yandra

గణేష్ ఉత్సవాలకి ప్రభుత్వం ఆంక్షలు విధించవద్దు – విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు

Dr Suneelkumar Yandra

జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, రక్షణ కల్పించాలి

Dr Suneelkumar Yandra

అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు

Dr Suneelkumar Yandra