November 18, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

వడ్డాది నుండి గంధవరం వరకు ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం పనులు కొద్దిరోజుల్లోనే ప్రారంభం

పిఠాపురం : దీర్ఘకాలిక సమస్య అయిన వడ్డాది నుండి  గంధవరం వరకు ఉన్న ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం ఆలస్యం అవడం వలన క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ దృష్టికి  చోడవరం జనసేన పార్టీ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు తీసుకువెళ్లారు. అనకాపల్లి కార్యాలయంలో పార్లమెంటు సభ్యులను కలసి ఈ రహదారి దుస్థితి వలన ప్రజలు పడుతున్న ఇక్కట్లు, తరచు జరుగుతున్న ప్రమాదాలవలన అనేకమంది తీవ్ర గాయాలు పలగడం, ప్రాణాలు కోల్పోవడాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్లారు. వెనువెంటనే సిఎం రమేష్ ఆర్ & బి శాఖ ఉన్నత అధికారులతోను మరియు కాంట్రాక్ట్ తీసుకొన్న కంపెనీ యజమాన్యంతోను సుధీర్గంగా చర్చించి వెంటనే రహదారి నిర్మాణం పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన కాంట్రాక్టు యాజమాన్యం రెండు వారాల్లో పనులు ప్రారింభిస్తామని తెలియచేసారు. ఈ ప్రధాన సమస్యపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న సిఎం రమేష్ కి చోడవరం నియోజకవర్గ ప్రజల తరఫున జనసేన పార్టీ కృతజ్ఞతలు తెలియచేస్తుందన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు పాల్గొన్నారు.

Related posts

వైభవముగా చండీ హోమము

Dr Suneelkumar Yandra

ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము – శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

నిరంతరం ప్రజా సేవలో మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

Dr Suneelkumar Yandra

ఓటర్ ఐడి కిఆధార్ అనుసంధానం పట్ల హర్షం

Dr Suneelkumar Yandra

భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు..

TNR NEWS

జీవ వైవిద్యం కాపాడాలి – పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra