Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

వడ్డాది నుండి గంధవరం వరకు ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం పనులు కొద్దిరోజుల్లోనే ప్రారంభం

పిఠాపురం : దీర్ఘకాలిక సమస్య అయిన వడ్డాది నుండి  గంధవరం వరకు ఉన్న ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం ఆలస్యం అవడం వలన క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ దృష్టికి  చోడవరం జనసేన పార్టీ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు తీసుకువెళ్లారు. అనకాపల్లి కార్యాలయంలో పార్లమెంటు సభ్యులను కలసి ఈ రహదారి దుస్థితి వలన ప్రజలు పడుతున్న ఇక్కట్లు, తరచు జరుగుతున్న ప్రమాదాలవలన అనేకమంది తీవ్ర గాయాలు పలగడం, ప్రాణాలు కోల్పోవడాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్లారు. వెనువెంటనే సిఎం రమేష్ ఆర్ & బి శాఖ ఉన్నత అధికారులతోను మరియు కాంట్రాక్ట్ తీసుకొన్న కంపెనీ యజమాన్యంతోను సుధీర్గంగా చర్చించి వెంటనే రహదారి నిర్మాణం పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన కాంట్రాక్టు యాజమాన్యం రెండు వారాల్లో పనులు ప్రారింభిస్తామని తెలియచేసారు. ఈ ప్రధాన సమస్యపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న సిఎం రమేష్ కి చోడవరం నియోజకవర్గ ప్రజల తరఫున జనసేన పార్టీ కృతజ్ఞతలు తెలియచేస్తుందన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

నిరుపేద కుటుంబాలకు అండగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

Dr Suneelkumar Yandra

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra

మార్కెట్ తరలింపు నిలిపివేయాలని ధర్నా

Dr Suneelkumar Yandra

సీఎం చంద్రబాబును మరిచిపోయిన అధికారులు.. సొంత ఇలాఖాలోనే ఇలానా?

TNR NEWS

ఏపీలో రెండ్రోజులు వర్షాల హెచ్చరిక.. పిడుగులు పడే అవకాశం

TNR NEWS

శివుడు ఎలా పుట్టాడో తెలుసా? శివుని జననం మరియు అవతారం యొక్క ఉత్తేజకరమైన కథ ఇక్కడ ఉంది.!!

Dr Suneelkumar Yandra