Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేకం.

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన సన్న బియ్యం పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎర్నేని బాబులు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని 29, 35 వ వార్డులలో రేషన్ డీలర్లు అశోక్,యోగానందం, రామ్మూర్తి దుకాణాలలో పేదలకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సన్న బియ్యం పేదలకు అందజేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించే సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ గుండెల సూర్యనారాయణ, మాజీ కౌన్సిలర్ వంటి పులి రమా శ్రీనివాస్, తోట శ్రీను కాంపాటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు……

Related posts

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవ వేడుకలు* ….

Harish Hs

విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం  బహుజన సమాజ్ పార్టీ జిల్లా కోశాధికారి కత్తి నాగబాబు

TNR NEWS

*నవంబర్ 29,30, డిసెంబర్ 1 తేదీలలో సూర్యాపేట లో జరిగే సిపిఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి.* *సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

రాజ్యాంగమే దేశానికి శ్రీరామరక్ష

TNR NEWS

గ్రూప్ III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్

Harish Hs

జాట్కో అభ్యర్థి పూల రవీందర్ ను గెలిపించండి

Harish Hs