Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సన్న బియ్యం పథకం దేశానికే ఆదర్శం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి చిత్రపటాలకు పాలాభిషేకం.

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన సన్న బియ్యం పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎర్నేని బాబులు అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని 29, 35 వ వార్డులలో రేషన్ డీలర్లు అశోక్,యోగానందం, రామ్మూర్తి దుకాణాలలో పేదలకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సన్న బియ్యం పేదలకు అందజేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వం అందించే సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ కేఎల్ఎన్ ప్రసాద్, మాజీ కౌన్సిలర్ గుండెల సూర్యనారాయణ, మాజీ కౌన్సిలర్ వంటి పులి రమా శ్రీనివాస్, తోట శ్రీను కాంపాటి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు……

Related posts

ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.

Harish Hs

గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను వన్ టైం సెటిల్ మెంట్ రాయితీ ఇవ్వాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

అన్నదానం మహా పుణ్య కార్యం.తహసిల్దార్ చంద్రశేఖర్,ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్

TNR NEWS

ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్‌

TNR NEWS

హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి బిసి బాలురవసతి గృహాన్ని పరిశీలించిన. బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం లక్ష్మీనారాయణ

TNR NEWS

9 వార్డులలో వార్డు సభలు 

TNR NEWS