Tnrnews.in
తెలంగాణ

కోదాడ మాతా నగర్ లో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు……..

కోదాడ పట్టణంలోని మాతా నగర్ లో శుక్రవారం ముందస్తు సెమీ క్రిస్మస్ వేడుకలు పాస్టర్ సుందర్ రావు కుమారుడు మాడుగుల రాహుల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగ్గయ్యపేట తెదేపా నాయకులు శ్రీరామ్ చిన్నబాబు, జయరాములు పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు నూతన వస్త్రాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు చూపిన బోధనలు క్షమాగుణం, శాంతి, కరుణ, సహనం, ప్రేమ, సదా అనుసరణీయమని వారు చూపిన బాటలో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ సుందర్ రావు,స్థానిక కౌన్సిలర్ షాబుద్దీన్, మామిడి రామారావు,గంధం పాండు,రాహుల్ గుండు,ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు………

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సి ఎం కప్ నిర్వహణ కోసం సమావేశం 

TNR NEWS

టీవీ ఏసి జేఏసీ నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ జయంతి

TNR NEWS

రాఘవేంద్ర పాఠశాలలో బోనాల సంబరాలు

TNR NEWS

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Harish Hs

అడవి పంది దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…

TNR NEWS