July 7, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రామానంద తీర్థ చైర్మన్ ను సన్మానించిన ఓయూ పూర్వ విద్యార్థులు 

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ గా ఓయూ ప్రొఫెసర్ నారా కిషోర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో శుక్రవారం ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. పదవి స్వీకారోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఓయూ పూర్వ విద్యార్థులు పర్శరాములు, ప్రేమ్ కుమార్, మంగన్న, కోటి రెడ్డి, ఎల్ రాంరెడ్డి, బండ నర్సింలు, డీ చంద్రయ్య హాజరై కిషోర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సంస్థ చైర్మన్ గా నియమించిన సిఎం రెవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తనకిచ్చిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తిస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానని ప్రకటించారు. సంస్థ ఇచ్చే శిక్షణ తరగతులను పేద నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Related posts

దేవాలయ విగ్రహాలకు భారీ విరాళం అందజేత

Harish Hs

తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను ప్రభుత్వాలు నెరవేర్చాలి…. ఈ నెల 24న సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు ఊరూరా ఉద్యమకారుల పాదయాత్ర పాదయాత్ర కరపత్రాలు ఆవిష్కరించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు సామ అంజిరెడ్డి

TNR NEWS

ఆపదలో అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి

TNR NEWS

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

TNR NEWS

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి.  రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి.  ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?

TNR NEWS