Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సుప్రీంకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం – డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ

హెచ్ సి యూ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించొద్దుని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా బుల్డోజర్లతో అక్కడి చెట్లను తొలగించి, భూమిని చదును చేసి, జంతువులకు తీవ్ర ఇబ్బంది కల్గించే చర్యలకు పాల్పడుతున్నది. దీన్ని వ్యతిరేకించిన విద్యార్థులపై లాఠీఛార్జీ, అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో ఇట్టి భూమిలో చెట్ల తొలగింపు, చదును చేయడం వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని డివైఎఫ్ఐ యువజన సంఘంగా స్వాగతిస్తున్నామని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ అన్నారు ఈ స్టేను దృష్టిలో పెట్టుకుని ఈ భూములను వేలం వేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పూనుకుంటే భవిష్యత్లో రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు, యువజనులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తామని అన్నారు.

Related posts

అనాధాశ్రమలు అన్నదాన కార్యక్రమం

Harish Hs

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Harish Hs

జగన్నాధపురం ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ

TNR NEWS

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆటోలతో ర్యాలీ. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్

TNR NEWS

మిర్చి రైతు వినూత్న ఆలోచన.. పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే..!

TNR NEWS

ధర్మ పీఠం పై దాడి హేయమైన చర్య బరితెగించిన మతోన్మాదిని శిక్షించాలి.  లౌకిక, ప్రజాస్వామిక,రాజ్యాంగ స్పూర్తిని కాపాడాలి  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు

TNR NEWS