Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సుప్రీంకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం – డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ

హెచ్ సి యూ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించొద్దుని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా బుల్డోజర్లతో అక్కడి చెట్లను తొలగించి, భూమిని చదును చేసి, జంతువులకు తీవ్ర ఇబ్బంది కల్గించే చర్యలకు పాల్పడుతున్నది. దీన్ని వ్యతిరేకించిన విద్యార్థులపై లాఠీఛార్జీ, అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో ఇట్టి భూమిలో చెట్ల తొలగింపు, చదును చేయడం వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని డివైఎఫ్ఐ యువజన సంఘంగా స్వాగతిస్తున్నామని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు మొహ్మద్ అలీ అన్నారు ఈ స్టేను దృష్టిలో పెట్టుకుని ఈ భూములను వేలం వేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పూనుకుంటే భవిష్యత్లో రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు, యువజనులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తామని అన్నారు.

Related posts

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను పునః ప్రతిష్ఠించాలి అణ గారిన కుమ్మరులకు అవమానం

TNR NEWS

అర్హత గల ప్రతీ వ్యక్తికి రేషన్ కార్డ్  – 40లక్షల కొత్త రేషన్ కార్డులిస్తాం.. – జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

TNR NEWS

మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి* చట్టప్రకారం నడుచుకుంటే అందరికీ మంచిది* దేవుడి విషయంలో రాజకీయం చేయదల్చుకోలేదు మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి నియోజవర్గ ప్రజలు చల్లంగా ఉండాలని కోరుకుంటున్నా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS

సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించి పలు సూచనలు చేసిన-రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిమాండ్

TNR NEWS

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ వాడకొప్పుల సైదులు 

TNR NEWS