Tnrnews.in
తెలంగాణ

పార్దివ రథాల సంఖ్యను పెంచాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

సూర్యాపేట టౌన్: రోజురోజుకు దిన, దిన అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట పట్టణంలో పార్థివ రధాలు మూడే ఉండటంవల్ల పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురైతున్నారని వాటి సంఖ్యను ఆరుకు పెంచాలని సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్ డిమాండ్ చేశారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీలో రెండు లక్షలకు పైగా ప్రజలు నివాసం ఉంటున్నారని రోజు అనేక మంది వివిధ కారణాల మూలంగా చనిపోతున్నారని వారికి అనుగుణంగా పార్థివ వాహనాలు లేకపోవడం పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సూర్యాపేట పట్టణంలో హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు మతాలవారీగా ఒక్కొక్కటి చొప్పున పార్థివ రథాలను పురపాలక సంఘం వారు కేటాయించారని అవి రెండు లక్షల పైగా ఉన్న సూర్యాపేట పట్టణ ప్రజలకు అసౌకర్యంగా ఉన్నాయని వాటి సంఖ్యను ఆరుకు పెంచాలని కోరారు. ఒకే మతం వారు ఇద్దరు ముగ్గురు ఒకేరోజు చనిపోయిన సందర్భంగా సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రజలకు సౌకర్యం మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు షేక్ జహంగీర్, టేకుల సుధాకర్ పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సర్వేలు చేస్తున్నారు సరే.. పథకాలేవీ.. పాలనేది? కేటీఆర్ ఘాటు విమర్శలు..!

TNR NEWS

పూర్వ విద్యార్థులు సేవా గుణం అలవర్చుకోవాలి  – ఘనంగా ఎండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువై విద్యార్థుల సమ్మేళనం   నాటి జ్ఞాపకాలు పంచుకొని ఆడి పాడి పొద్దంతా ఆనందంగా గడిపిన స్నేహితులు

TNR NEWS

మునగాల పోలీస్ స్టేషన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Harish Hs

*ఉచిత ప్రత్యేక వైద్య శిబిరం* *ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయోధ్యాపురం డాక్టర్ యమున ఆధ్వర్యంలో* 

TNR NEWS

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇన్విజిలేటర్లు ఓఎంఆర్ షీట్లపై తప్పుడు హాల్ టికెట్ నెంబర్లు బబ్లింగ్ చేసిన వైనం.. తప్పు తెలుసుకుని దిద్దడంతో ఓఎంఆర్ షీట్ కి బొక్క… ఇష్టానుసారం గా వ్యవహరిస్తున్న ఇన్విజిలేటర్లు పై చర్యలు తీసుకోవాలి… నవోదయ సెంటర్ ముందు ఆందోళన చేసిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు… టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు…

TNR NEWS

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS