Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం నియోజక వర్గం పల్లెలకు రహదారి కళ

  • నిర్మాణం పూర్తి చేసుకున్న పల్లె పండుగ రోడ్లు

 

  • కొత్త రోడ్లను ప్రారంభించిన శాసన మండలి సభ్యుడు నాగబాబు

 

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గ్రామీణ రహదారులను శాసన మండలి సభ్యుడు కొణిదల నాగబాబు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోడ్లు నిర్మించారు. శనివారం ఉదయం పిఠాపురం మండలం, కుమారపురం హౌసింగ్ లే అవుట్ –1లో రూ.15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రోడ్డు నాణ్యతను పరిశీలించారు. విరవ నుంచి కోలంక, గోకివాడలను కలుపుకొంటూ ఈ రహదారి వెళ్తుంది. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు), మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

ఢిల్లీలో పర్యటిస్తున్న మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ*

TNR NEWS

వయోజన విద్యా సెంటర్స్ ప్రారంభోత్సవం

ఘనంగా ఆదిత్యలో ఐఎన్ఎస్పిఐఆర్ఏ (ఇన్స్పిరా) అకాడమిక్ ఫెయిర్

ఏపీకి దూసుకొస్తున్న ముప్పు.. రేపటి నుంచి వర్షాలు

TNR NEWS

బెట్టింగ్ మాఫియా డొంక లాగుతున్న పోలీసులు! నిర్వహుకులే అసలైన టార్గెట్..?

Dr Suneelkumar Yandra

త్రేతాయుగ ప్రతీక “భద్రాచల పాదయాత్ర” – 14వార్షికాలు పూర్తి చేసిన గురుస్వామి వాసుదేవ ఆచార్యను సత్కరించిన గణపతి పీఠం

Dr Suneelkumar Yandra