Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం నియోజక వర్గం పల్లెలకు రహదారి కళ

  • నిర్మాణం పూర్తి చేసుకున్న పల్లె పండుగ రోడ్లు

 

  • కొత్త రోడ్లను ప్రారంభించిన శాసన మండలి సభ్యుడు నాగబాబు

 

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన గ్రామీణ రహదారులను శాసన మండలి సభ్యుడు కొణిదల నాగబాబు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోడ్లు నిర్మించారు. శనివారం ఉదయం పిఠాపురం మండలం, కుమారపురం హౌసింగ్ లే అవుట్ –1లో రూ.15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.75 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. రోడ్డు నాణ్యతను పరిశీలించారు. విరవ నుంచి కోలంక, గోకివాడలను కలుపుకొంటూ ఈ రహదారి వెళ్తుంది. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు), మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాలలో బండారు శ్రీనివాస్ విస్తృత ప్రచారం

Dr Suneelkumar Yandra

పట్టభద్రుల పోలింగ్ లో ఆలోచించి ఓటేయాలి – మాజీ ఎంపిటిసి పితాని వేంకట రాము విజ్ఞప్తి

Dr Suneelkumar Yandra

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

TNR NEWS

పిఠాపురంలో హా(హి)ట్‌ టాపిక్‌…!

యమునా నది పుష్కర పురస్కారం అందుకున్న డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర

TNR NEWS

ఆవిర్భావ సభను విజయవంతం చేయండి – జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్