Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

చిల్డ్రన్ మరియు యూత్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్

పిఠాపురం : కాకినాడ జిల్లా పిఠాపురం బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ చర్చ్ లో షాలేమ్ గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సండేస్కూల్ టీచర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈసందర్భంగా పాస్టర్ టి.కరుణ్ రాజు మాట్లాడుతూ చాలా మంది చిన్నపిల్లలు మరియు యవ్వనస్థులు సెల్ ఫోన్ కి, వీడియో గేమ్స్,ఫేస్బుక్ వాటికి  అలవాట్లకు బానిసై తల్లిదండ్రులు మీద తిరుగుబాటు అవ్వుతూ, చదువు మీద ఏకగ్రత లేక పోవడం, వారు మానసికంగా ఎవరితో కలవకుండా ఒంటరిగా జీవించడం జరుగుతుందని, ఈ వేసవి సెలవుల్లో కూడా చిన్ని పిల్లలు సెల్ ఫోన్ కి ఎక్కువ సమయం  గడుపుతు వుంటారన్నారు. అందుకే చిన్న పిల్లలుకు మరియు యవ్వనస్థులకు డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా  టీచర్స్ కి చైల్డ్ సైకాలజీ, మోటివేషన్ సాంగ్స్, టీచింగ్ మెథేడ్స్ మొదలగు వాటిపై సేవాభారత్ టీమ్ నానాజీ, బి.నానిబాబు  మరియు  కె.ఎలీషా నేర్పించడం జరిగింద న్నారు., ఈకార్యక్రమానికి బర్నింగ్ టూల్స్ మినిస్ట్రీస్ డైరెక్టర్ కె.ఎలీషా స్పాన్సర్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం కె.రాణి ఓఫీర్  చేతులు మీదుగా టీచర్స్ కి సర్టిఫికెట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి.సి.పి.డబ్ల్యూ.ఎ.సెక్రటరీ. పి.సోంబాబు, యల్ల అనిల్ కుమార్, వి. స్టాలిన్, టి.బ్యూలాగ్రేస్, కె.నిస్సీ, శంఖవరం, చేబ్రోలు, నాగులపల్లి, కుమారపురం, పిఠాపురం తదితర ప్రాంతాల నుండి టీచర్స్ పాల్గొన్నారు.

Related posts

కు.ని పాటించిన రాష్ట్రాల్లో సీట్ల పెంపుకు ప్రాధాన్యత కల్పించాలి

Dr Suneelkumar Yandra

సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు

TNR NEWS

ప్రభుత్వాసుపత్రిని కాకినాడ జిల్లాకు పరిమితం చేయాలి

కాకినాడ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

పీఠికాపుర ప్రముఖులకు ఉగాది ప్రతిభా పురస్కారాలు

Dr Suneelkumar Yandra

రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్

Dr Suneelkumar Yandra