Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

పట్టభద్రుల పోలింగ్ లో ఆలోచించి ఓటేయాలి – – మాజీ ఎంపిటిసి పితాని వేంకట రాము విజ్ఞప్తి

కాకినాడ : ఓటుకు సార్ధకత చేకూరేవిధంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల భవిష్యత్ కు బంగారు బాట వేసే సమర్ధత, సామర్ధ్యం కలిగిన రాజశేఖరంను శాసన మండలికి పంపించాల్సిన ఆవశ్యకత నెలకొందని తూరంగి మాజీ ఎంపీటిసి పితాని వెంకట రాము పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల ఫిబ్రవరి 27న జరుగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం కూటమి అభ్యర్దిగా సూదీర్ఘ కాలం ప్రజలతో మమేకం అయ్యి, ప్రజా సమస్యల పై సంపూర్ణ అవగాహన కలిగిన అజాత శత్రువు, రాజకీయ స్టితప్రజ్ణుడు పేరాబత్తుల రాజశేఖరంకు కేటాయించిన ఎన్నికల బ్యాలెట్ పత్రంలో మొదటి ప్రాధాన్యత కల్పించి ఆయన పేరుకు ఎదురుగా ఉన్న బాక్స్ లో కేవలం ఒకటి అంకె మాత్రమే వేసి అఖండ మైన మెజారిటీతో శాసన మండలికి పంపించాలని కోరుతున్నారు. అత్యదిక మేధావులు, ఉన్నత విద్యావంతులు, విద్యా వేత్తలు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికల్లో పట్టభద్రుల విధి విధానాలు, ఉపాధి, ఉద్యోగాలు అంశాల పై పోరాడి సాధించే సత్తా కల్గిన నాయకుడు పేరా బత్తుల రాజశేఖరం మాత్రమే అన్న విషయాన్ని పట్ట బద్రులు విజ్ఞతతో ఆలోచించి పేరాబత్తుల రాజశేఖరంకు పట్టం కట్టడడం ఎంత అయినా సమూచితంగా ఉంటుందని పితాని వెంకట రాము కోరుతున్నారు.

Related posts

డేంజర్ బెల్స్ మ్రోగిస్తున్న కాకినాడ టుటౌన్ బ్రిడ్జి

Dr Suneelkumar Yandra

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆధ్వర్యంలో పండుగ వాతావరణం లో ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమం

TNR NEWS

నేడు కవిశేఖర్ డా.ఉమర్ ఆలీషా 140వ జయంత్యోత్సవ సభ

Dr Suneelkumar Yandra

మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన ఆదర్శ్ కళాశాల

Dr Suneelkumar Yandra

మార్చి 3న భద్రాద్రి పాదయాత్ర రామాలయ విగ్రహా ప్రతిష్ట

Dr Suneelkumar Yandra

ఉగాది వేడుకల్లో పాల్గొన్న గౌరీ నాయుడు

Dr Suneelkumar Yandra