Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మర్రెడ్డి

పిఠాపురం : మహాశివరాత్రి పురస్కరించుకుని ప్రతీ సంవత్సరం ఏర్పాటు చేసినట్లుగానే ఈ సంవత్సరం కూడా పిఠాపురం పట్టణం ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్.ప్రభుత్వ పాఠశాల, కళాశాలల క్రీడా స్థలంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ను పిఠాపురం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ మేనేజర్ ఎం.శ్రీనివాస్, ఆర్గనైజర్ డి.భద్రరావులు మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రానికి విచ్చేసే భక్తులకు వినోదం కోసం ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించామన్నారు. ఈ ఎగ్జిబిషన్ 40 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో జెయింట్ విల్, కొలంబస్, బ్రేక్ డ్యాన్స్, రైఫిల్ షూటింగ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు, చిన్నపిల్లలకు ఉపయోగపడే పలు స్టాళ్లను, అదే విధంగా ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, జనసేన నాయకులు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, సూరవరపు సురేష్, బొజ్జా లోవరాజు, కోలా దుర్గా, డా. వరలక్ష్మి, పిల్లా రమ్యజ్యోతి, కమల, టైల్స్ బాబీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాకినాడ ఈద్గా మైదానం కోర్టుకేసులు పరిష్కరించాలి.. అభివృద్ధి చేయాలి – ముఖ్యమంత్రి, డిప్యూటీ సిఎం, మైనారిటీ, ఐటి, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులకు పౌర సంక్షేమ సంఘం లేఖ

Dr Suneelkumar Yandra

ఘనంగా మల్లు స్వరాజ్యం మూడోవ వర్ధంతి

Dr Suneelkumar Yandra

కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ:*

TNR NEWS

రోలుగుంట, రావికమతం నాయకులతో సమావేశం నిర్వహించిన చోడవరం నియోజకవర్గ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు

Dr Suneelkumar Yandra

ఏపీలో బీచ్‌లకు ప్రవేశ రుసుం.. మంత్రి క్లారిటీ

TNR NEWS

కార్పోరేషన్ ఖజానా గుల్ల చేస్తున్న టెన్నిస్ కోర్టులు – పౌర సంక్షేమ సంఘం డిమాండ్

Dr Suneelkumar Yandra