Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఉచ్చులోపడి చిరుత బలి కావడంపై విచారణ

  • ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం

 

మంగళగిరి : అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో ఉచ్చులో చిక్కుకొని చిరుత బలయిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పి.సి.సి.ఎఫ్. చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు. పొన్నూటిపాళెం వద్ద ఆడ చిరుత ఉచ్చులోపడిపోయి కొన్ని గంటలపాటు పెనుగులాడి చనిపోవడం, ఆ చిరుత కడుపులో రెండు కూనలు ఉండటం, ఆ కూనలు కూడా గర్భంలో చనిపోయిన విషయాలు పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చాయి. క్షేత్ర స్థాయి నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని, శాఖాపరంగా ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించారు. ఘటన చోటు చేసుకున్న అనంతరం సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందించారనే విషయాన్నీ తెలియచేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోనూ, అటవీ ప్రాంతాన్ని సమీప గ్రామాల్లో జంతువుల కోసం ఉచ్చులు వేసే వేటగాళ్ళు, ఆ తరహా నేరాలు చేస్తున్నవారిపై నిఘా ఉంచాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పొన్నూటిపాళెం ఘటనపై విచారణను పర్యవేక్షించాలని అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావుకి దిశానిర్దేశం చేశారు.

 

Related posts

ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సంతాప దినాలు

Dr Suneelkumar Yandra

ఎస్ఐ శ్రీ మహేష్ బాబు మరియు HC శ్రీ మొగిలీశ్వర్ రెడ్డి లు సస్పెండ్.*

TNR NEWS

ఆవిర్భావ సభ భద్రత ఏర్పాట్లుపై మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష

Dr Suneelkumar Yandra

బాల కార్మికులతో వెట్టిచాకిరి – పట్టించుకోని లేబర్ ఇన్స్పెక్టర్

Dr Suneelkumar Yandra

సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శ్రీపతి

TNR NEWS

మాదక ద్రవ్యాలు మీద అవేర్నెస్ క్యాంపు యువతకి చాలా ఉపయోగకరం – పట్టణ సిఐ జి.శ్రీనివాస్

Dr Suneelkumar Yandra