Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఉచ్చులోపడి చిరుత బలి కావడంపై విచారణ

  • ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశం

 

మంగళగిరి : అన్నమయ్య జిల్లా పొన్నూటిపాళెం సమీపంలో ఉచ్చులో చిక్కుకొని చిరుత బలయిన ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు పి.సి.సి.ఎఫ్. చలపతిరావుని విచారణ అధికారిగా నియమించారు. పొన్నూటిపాళెం వద్ద ఆడ చిరుత ఉచ్చులోపడిపోయి కొన్ని గంటలపాటు పెనుగులాడి చనిపోవడం, ఆ చిరుత కడుపులో రెండు కూనలు ఉండటం, ఆ కూనలు కూడా గర్భంలో చనిపోయిన విషయాలు పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చాయి. క్షేత్ర స్థాయి నుంచి అందిన ప్రాథమిక సమాచారాన్ని, శాఖాపరంగా ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించారు. ఘటన చోటు చేసుకున్న అనంతరం సంబంధిత అధికారులు ఏ విధంగా స్పందించారనే విషయాన్నీ తెలియచేయాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లోనూ, అటవీ ప్రాంతాన్ని సమీప గ్రామాల్లో జంతువుల కోసం ఉచ్చులు వేసే వేటగాళ్ళు, ఆ తరహా నేరాలు చేస్తున్నవారిపై నిఘా ఉంచాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పొన్నూటిపాళెం ఘటనపై విచారణను పర్యవేక్షించాలని అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావుకి దిశానిర్దేశం చేశారు.

 

Related posts

కాకినాడ కార్పోరేషన్ ప్రగతి పట్టాలెక్కించేదెప్పుడు

Dr Suneelkumar Yandra

మంగళగిరి వచ్చిన రాజేంద్రప్రసాద్ పవన్ తో మర్యాదపూర్వక భేటీ

TNR NEWS

పిఠాపురం నియోజకవర్గానికి చెందిన యువకుడు దర్శకత్వంలో “శివాజ్ఞ”

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,74,660/-

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

Dr Suneelkumar Yandra

శాంతిస్థాపనతోనే సామాజిక న్యాయం సాధ్యం

Dr Suneelkumar Yandra