కాకినాడ : కాకినాడ ఉత్తర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిర్వహించిన దాడుల్లో నాటు సారాను, 400 లీటర్ల బెల్లపు ఊటను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజర పరిచినట్లు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై చైతన్య మురళి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించినట్లుగా సిఐ తెలిపారు. సామర్లకోటకు చెందిన కోశెట్టి వరలక్ష్మి, మాదమని సత్యవతి, కాళ్ళ సరోజ వద్ద నుండి నాటు సారా స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసినట్లుగా సిఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సైలు ఎం.వి.వి.ఎస్.కుమార్, బి.ఎన్.ఎస్.వరహాలు, నరసింహారావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

previous post
next post