Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

నేటికలెక్టరేట్ ముట్టడికి రైతాంగం తరలి రావాలి.  తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి

సూర్యాపేట: ఐకెపి కేంద్రాలలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 8న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఐకెపి కేంద్రాలు ప్రారంభమై రెండు నెలలు అవుతున్న నేటికీ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకెపి కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని లిఫ్ట్ చేసేందుకు లారీలు రాకపోవడంతో సమస్య తీవ్రంగా తయారైందన్నారు. మిల్లుల వద్దకు పోయిన ధాన్యాన్ని దిగుమతి వరద గతిన చేయాలన్నారు. తరుగు పేరుతో ఒక లారీకి 14 క్వింటాల ధాన్యాన్ని రైతుల వద్ద నుండి బలవంతంగా తీసుకుంటున్నారని దీనిని వెంటనే ఉపసంహరించాలని కోరారు.

Related posts

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

Harish Hs

కూలీల ఆటో బోల్తా, పలువురికి గాయాలు

TNR NEWS

న్యాయవాది పై జరిగిన దాడికి నిరసనగా కోర్టు విధులు బహిష్కరణ

TNR NEWS

ప్రజలను భయభ్రాంతులకు గురిచేయవద్దు .. అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ టిబ్రేవాల్

TNR NEWS

ఉమ్మడి నల్లగొండ పోలీస్ సిబ్బందికి మిర్యాలగూడలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించిన కొన్ని మెడికల్ ప్రైవేటు సంస్థలు

Harish Hs

బానోత్ బిక్షం నాయక్ మరణం తీరని లోటు

Harish Hs