సూర్యాపేట: ఐకెపి కేంద్రాలలోని రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మే 8న సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఐకెపి కేంద్రాలు ప్రారంభమై రెండు నెలలు అవుతున్న నేటికీ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకెపి కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని లిఫ్ట్ చేసేందుకు లారీలు రాకపోవడంతో సమస్య తీవ్రంగా తయారైందన్నారు. మిల్లుల వద్దకు పోయిన ధాన్యాన్ని దిగుమతి వరద గతిన చేయాలన్నారు. తరుగు పేరుతో ఒక లారీకి 14 క్వింటాల ధాన్యాన్ని రైతుల వద్ద నుండి బలవంతంగా తీసుకుంటున్నారని దీనిని వెంటనే ఉపసంహరించాలని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
