కోదాడ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశానుసారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, జాతీయ జెండాను ముఖ్య నాయకులు పైడిమర్రి. సత్తిబాబు, పార్టీ జెండాను పట్టణ అధ్యక్షులు షేక్ నయీమ్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అనంతగిరి రోడ్డులోతెలంగాణ తల్లి, కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు నివాళులు అర్పించారు. జై తెలంగాణ,జై కేసీఆర్ అంటూ బి. ఆర్. ఎస్ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన కేసీఆర్ చావు చివరి వరకు పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి అనంతరం పదేళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మేదర లలిద, కందుల చంద్రశేఖర్, అలవాల వెంకట్, మామిడి రామారావు, కర్ల సుందర్ బాబు , గట్ల కోటేశ్వరరావు, సంగిశెట్టి గోపాల్, బత్తుల ఉపేందర్, కాసాని మల్లయ్య గౌడా షేక్ అబ్బు, ఆరీఫ్, షేక్ అలీమ్, లాజర్, బొర్రా వంశీ, బొజ్ఞా గోపి, నిస్సార్, కనగాల శ్రీధర్, తాజ్, జానీ ఆర్ట్స్, సోమపంగు నాగరాజు, చీమ శ్రీనివాసరావు, కర్ల నర్సయ్య , సిద్దెల రాంబాబు, కలకొండ వెంకటనారాయణ, కుడుముల సైదులు, నసిర్, మజాహార్ తదితరులు పాల్గొన్నారు…………