Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దళిత యువకుడు రాజేష్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి… *జైలు నుండి పోలీసుల ద్వారా హాస్పిటల్ కి వెళ్ళిన రాజేష్ మృతి చెందితే ప్రభుత్వ అధికారులు కుటుంబాన్ని పరామర్శించకపోవడం సరి కాదు… దళితుల పట్ల పోలీస్ అధికారుల చిన్న చూపు తగదు… రాజేష్ కుటుంబానికి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి… KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్…

కోదాడ,చిలుకూరు పోలీసుల నిర్లక్ష్యం మూలంగా మృతి చెందిన కోదాడ గాంధీనగర్ కు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి పై సమగ్ర విచారణ జరపాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. ఈరోజు కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోదాడ గాంధీ నగర్ లోని కర్ల రాజేష్ తల్లి,తమ్ముడిని పరామర్శించి మృతికి సంబంధించిన వివరాలు తెలుసుకొని,రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ లో అక్రమాలు జరిగాయనే పేరుతో రాజేష్ పై కేసు నమోదు చేయకుండా నాలుగు రోజులు విచారణ పేరుతో కోదాడ పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని అన్నారు.రిమాండ్ చేయకముందే అనారోగ్యంతో బాధపడుతున్న రాజేష్ కు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడంతో మృతి చెందారని,రాజేష్ మృతికి పోలీసులే బాధ్యత వహించాలని అన్నారు. రాజేష్ పై ఎఫ్ఐఆర్ చేయకుండా, రాత్రిపూట ఇంటికి పంపకుండా స్టేషన్ లోనే ఉంచి నాలుగు రోజులు ఎలా విచారణ చేశారని ప్రశ్నించారు. విచారణ సమయంలో రాజేష్ ని కలవడానికి తల్లి వెళ్లిన సందర్భంలో కనీసం మాట్లాడకుండా చేశారని తెలిపారు. రాజేష్ పై మోపబడ్డ కేసుకు సంబంధించిన డబ్బులు పోలీసులు రికవరీ చేసి కూడా అతని తీవ్ర ఇబ్బందులు గురిచేసారని దాని మూలంగానే రాజేష్ ఆరోగ్యం దెబ్బతిని చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పోలీస్ కేసు మోపబడి పోలీసుల విచారణను ఎదుర్కొన్న రాజేష్ జైల్లో నుండి హాస్పిటల్ కి వెళ్లి మృతి చెందితే కనీసం ప్రభుత్వ అధికారులు ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడం దుర్మార్గమన్నారు.జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రభుత్వం నుండి రావలసిన సహకారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. రాజేష్ మరణానికి కోదాడ చిలుకూరు పోలీసులే కారణమంటూ దళిత సంఘాలు ఆందోళన చేసిన ఫలితంగా ప్రకటించిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజేష్ మృతిలో అడుగడుగున పోలీసుల యొక్క వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుందన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని హాస్పిటల్లో చెకప్ చేయించకుండా రిమాండ్ చేయడం జైలుకు తీసుకెళ్లాక ఆరోగ్యం బాగాలేదని పేరుతో హుజూర్నగర్,సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్లో మరియు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స అందించడం వంటి పరిణామాలు చూస్తే పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందన్నారు. దళితుల పట్ల ప్రభుత్వ అధికారులకు,పోలీసులకు చిన్న చూపు తగదని అన్నారు. ఇప్పటికైనా రాజేష్ మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు టేకుల సుధాకర్,డి.దుర్గారావు సిఐటియు పట్టణ కన్వీనర్ మిట్టగడుపుల ముత్యాలు, దాసరి శ్రీనివాస్ కెవిపిఎస్ జిల్లా నాయకులు జంగపల్లి శ్రీను రాజేష్ కుటుంబ సభ్యులు కర్ల రాజా,రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి మతోన్మాదుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి  వామపక్ష పార్టీలు డిమాండ్

TNR NEWS

ఇందిరమ్మ రాజ్యం దేశానికి ఆదర్శం 

TNR NEWS

సీనియర్లు జూనియర్లకు మార్గదర్శకులుగా ఉండాలి

TNR NEWS

తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా చిర్రా శ్రీనివాస్

Harish Hs

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెల్లిసైదులు

TNR NEWS

42 శాతం రిజర్వేషన్ కొరకు బీసీలు చేస్తున్న ఉద్యమానికి సకజనులూ మద్దతు ఇవ్వండి

TNR NEWS