Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలోని ప్రైమరీ స్కూల్ లో మొక్కను నాటిన మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి ప్రాణాధారం చెట్లు,అలాంటిది మెుక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. వాతావరణం సమతుల్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.. పర్యావరణ రక్షణకు వర్షాలు సమృద్ధిగా కురవడానికి వృక్షాలు, అడవులు దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కు బదులుగా చేతి సంచులు వాడాలని తెలిపారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పొడి చెత్త, తడి చెత్త వేరువేరుగా వేస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ నరేష్, ఏపీవో శైలజ, పంచాయతీ సెక్రెటరీ రజిత, ఎఫ్ ఏ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీసు పనితీరును ప్రజలు ఆన్లైన్ నందు తెలుపవచ్చు

Harish Hs

లక్ష డప్పులతో సత్తా చాటుతాం

Harish Hs

ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

Harish Hs

పార్దివ రథాల సంఖ్యను పెంచాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

ప్రతిభ చూపితే ఉద్యోగ అవకాశాలు

TNR NEWS

350,999కు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న రామినేని శ్రీనివాసరావు

TNR NEWS