Tnrnews.in
తెలంగాణ

మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలోని ప్రైమరీ స్కూల్ లో మొక్కను నాటిన మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి ప్రాణాధారం చెట్లు,అలాంటిది మెుక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. వాతావరణం సమతుల్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.. పర్యావరణ రక్షణకు వర్షాలు సమృద్ధిగా కురవడానికి వృక్షాలు, అడవులు దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కు బదులుగా చేతి సంచులు వాడాలని తెలిపారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పొడి చెత్త, తడి చెత్త వేరువేరుగా వేస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ నరేష్, ఏపీవో శైలజ, పంచాయతీ సెక్రెటరీ రజిత, ఎఫ్ ఏ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

TNR NEWS

వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి

Harish Hs

జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభం

TNR NEWS

ఘనంగా హిందూ ముస్లిం ఐక్యత దినోత్సవం…..

TNR NEWS

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

Harish Hs

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు

TNR NEWS