Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలోని ప్రైమరీ స్కూల్ లో మొక్కను నాటిన మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి ప్రాణాధారం చెట్లు,అలాంటిది మెుక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. వాతావరణం సమతుల్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.. పర్యావరణ రక్షణకు వర్షాలు సమృద్ధిగా కురవడానికి వృక్షాలు, అడవులు దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కు బదులుగా చేతి సంచులు వాడాలని తెలిపారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పొడి చెత్త, తడి చెత్త వేరువేరుగా వేస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ నరేష్, ఏపీవో శైలజ, పంచాయతీ సెక్రెటరీ రజిత, ఎఫ్ ఏ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఓదెల లో తాగునీటి కోసం తంటాలు ట్యాంకర్ సహాయంతో మంచినీరు అందిస్తున్న కార్యదర్శి చంద్రారెడ్డి

TNR NEWS

గురుకులాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

TNR NEWS

*సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా మట్టి పెళ్లి సైదులు ఎన్నిక…..* 

TNR NEWS

కనుల పండువగా అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

TNR NEWS

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి…. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

పెద్దపల్లి లో ఘోర రోడ్ ప్రమాదం

TNR NEWS