Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలోని ప్రైమరీ స్కూల్ లో మొక్కను నాటిన మునగాల మండల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూమి మీద ఉన్న ప్రతి జీవకోటికి ప్రాణాధారం చెట్లు,అలాంటిది మెుక్కను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు.మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. వాతావరణం సమతుల్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.. పర్యావరణ రక్షణకు వర్షాలు సమృద్ధిగా కురవడానికి వృక్షాలు, అడవులు దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కు బదులుగా చేతి సంచులు వాడాలని తెలిపారు.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పొడి చెత్త, తడి చెత్త వేరువేరుగా వేస్తూ, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ నరేష్, ఏపీవో శైలజ, పంచాయతీ సెక్రెటరీ రజిత, ఎఫ్ ఏ వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకిచ్చిన హమీలను నెరవేర్చాలి – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి

TNR NEWS

దివ్యాంగుల అనాధాశ్రమానికి లక్ష రూపాయల విరాళం అందజేత

Harish Hs

TNR NEWS

ఎమ్మార్పీఎస్ మహిళ జగిత్యాల జిల్లా ఇన్చార్జిగా వనిత 

TNR NEWS

పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

Harish Hs

పొగ మంచు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

Harish Hs