Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కలాం దేశానికి  చేసిన సేవలు చిరస్మరణీయం

భారత దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. ఆదివారం కలాం వర్ధంతి సందర్భంగా విజయీభవ ట్రస్ట్, స్వర్ణ భారతి ట్రస్ట్, ఇరుకుళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్రజ్ఞుడు అని రాష్ట్రపతిగా అన్ని వర్గాల ప్రజల మన్ననలను అందుకుని ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలామ్ అని అన్నారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలి అన్నారు.  ఈ కార్యక్రమంలో పైడిమర్రి వెంకటనారాయణ, ట్రస్ట్ సభ్యులు చారుగండ్ల రాజశేఖర్, యాదా సుధాకర్, పందిరి సత్యనారాయణ, వెంపటి వెంకటనారాయణ, వెంపటి ప్రసాద్, బండారు శ్రీనివాసరావు, గుడుగుంట్ల సాయి, పత్తి నరేందర్, మహంకాళి సత్యనారాయణ, స్వామి శ్రీనివాసరావు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు……….

Related posts

అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం పై అవగాహన

TNR NEWS

గురుకులాల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

TNR NEWS

వైభవంగా శ్రీశ్రీశ్రీ లక్ష్మి కోట మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం

TNR NEWS

దుకాణ సముదాయాలు, గోదాములను ప్రారంభించిన మంత్రి

TNR NEWS

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

వైకల్య ధ్రువీకరణ పత్రం పొండెందుకు 2016 ఆర్ పి డబ్ల్యు డి చట్టానికి సవరణలు చేయాలనే గెజిట్ ను రద్దు చేయాలి వైకల్య శాతన్ని బట్టి కాకుండా వికలాంగులందరికి ఒకే యు డి ఐ డి కార్డు జారీచేయాలి  ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శు వీరబోయిన వెంకన్న

TNR NEWS