Tnrnews.in
తెలంగాణ

తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిది

తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేనిదని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు… ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జనగాం ఎక్స్ రోడ్డు వద్ద మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తల్లిదండ్రులు బూర లక్ష్మయ్య గౌడ్, బూర రాజమ్మ ల జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి, తనను చదివించారని, వారి జ్ఞాపకార్థం వారి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. సమాజానికి సేవ చేయడం ద్వారా వారి ఆశయాలను నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు. సమాజంలో తమ పిల్లలు ఉన్నత స్థితికి ఎదగాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారని, వారి కోరిక తీరే విధంగా పిల్లలు కష్టపడి చదివి జీవితంలో ఉన్న స్థాయికి చేరుకోవాలని, సమాజానికి ఉపయోగపడే విధంగా వారు ఉత్తమ పౌరులుగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, మాజీ అధికార ప్రతినిధి బూర మల్సూరు గౌడ్, బిజెపి నాయకులు కడియం రామచంద్రయ్య,మన్మధ రెడ్డి,చల్లమల్ల నరసింహ,పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇచ్చే పథకాలు వర్తింపజేయాలి

TNR NEWS

సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

TNR NEWS

వేములవాడలో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి స్వీకారం

TNR NEWS

_పెద్దగట్టు జాతర సందర్భంగా జాతీయరహదారి (ఎన్ హెచ్) 65 పై వాహనాల మళ్లింపు కు రూట్ మ్యాప్ విడుదల చేసిన సూర్యాపేట జిల్లా పోలీసు_

Harish Hs

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు 

TNR NEWS

మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

TNR NEWS