Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైతు భరోసా, బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలి

వేసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.గురువారం కోదాడ పట్టణంలో ఆర్డీవో సూర్యనారాయణ ను రైతులతో కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కోదాడ పిఎసిఎస్ పరిధిలోని గ్రామాలైన కోదాడ, కొమరబండ, తమ్మర, గుడిబండ,తొగర్రాయి, గణపవరం, కూచిపూడి గ్రామాలలో కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 2 కోట్ల 25 లక్షల రూపాయలు బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని కొనుగోళ్లు పూర్తయి 20 రోజులు కావస్తున్న నేటి వరకు రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కాలేదు అన్నారు. వానాకాలం సీజన్ లో కూడా రైతు భరోసా రాని రైతులు ఉన్నారని ఇప్పటివరకు మూడున్నర ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చారని రైతులందరికీ బోనస్ తో పాటు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కనగాల కొండయ్య, మునగా రాంప్రసాద్, కొండ సురేష్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు………

 

Related posts

గుండాల రాములుకు జోహార్లు

TNR NEWS

బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ 

TNR NEWS

గ్రామ స్వరాజ్యం సాధించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల జైపాల్ రెడ్డి 

TNR NEWS

*చలితో రాష్ట్రం గజగజ..!!*

TNR NEWS

మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి* చట్టప్రకారం నడుచుకుంటే అందరికీ మంచిది* దేవుడి విషయంలో రాజకీయం చేయదల్చుకోలేదు మల్లన్న కళ్యాణాన్ని ఇంకా బ్రహ్మాండంగా జరిపించాలి నియోజవర్గ ప్రజలు చల్లంగా ఉండాలని కోరుకుంటున్నా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS

ప్రభుత్వ హాస్పిటల్ లో మెరుగైన ప్రసూతి సేవలు అందించాలి…సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలి…. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి….. మెను ప్రకారం విద్యార్థులకి భోజన సౌకర్యం కల్పించాలి…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS