Tnrnews.in
తెలంగాణ

రైతు భరోసా, బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలి

వేసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.గురువారం కోదాడ పట్టణంలో ఆర్డీవో సూర్యనారాయణ ను రైతులతో కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కోదాడ పిఎసిఎస్ పరిధిలోని గ్రామాలైన కోదాడ, కొమరబండ, తమ్మర, గుడిబండ,తొగర్రాయి, గణపవరం, కూచిపూడి గ్రామాలలో కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 2 కోట్ల 25 లక్షల రూపాయలు బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని కొనుగోళ్లు పూర్తయి 20 రోజులు కావస్తున్న నేటి వరకు రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కాలేదు అన్నారు. వానాకాలం సీజన్ లో కూడా రైతు భరోసా రాని రైతులు ఉన్నారని ఇప్పటివరకు మూడున్నర ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చారని రైతులందరికీ బోనస్ తో పాటు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కనగాల కొండయ్య, మునగా రాంప్రసాద్, కొండ సురేష్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు………

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

హెచ్ సి యు భూముల వేలాన్ని ఆపాలి

Harish Hs

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

TNR NEWS

టియుటిఎఫ్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా జిల్లా వాసి…

Harish Hs

కోదాడ బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో ఘనంగా వసంత పంచమి మహోత్సవం వేడుకలు

Harish Hs

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాప్ షో – దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.

TNR NEWS

రైతులపై దాడులకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలి.  రైతాంగం పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి.  రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఎస్కేయం డిమాండ్

TNR NEWS