Tnrnews.in
తెలంగాణ

రైతు భరోసా, బోనస్ డబ్బులను వెంటనే చెల్లించాలి

వేసంగి సీజన్లో ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు.గురువారం కోదాడ పట్టణంలో ఆర్డీవో సూర్యనారాయణ ను రైతులతో కలిసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. కోదాడ పిఎసిఎస్ పరిధిలోని గ్రామాలైన కోదాడ, కొమరబండ, తమ్మర, గుడిబండ,తొగర్రాయి, గణపవరం, కూచిపూడి గ్రామాలలో కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి 2 కోట్ల 25 లక్షల రూపాయలు బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని కొనుగోళ్లు పూర్తయి 20 రోజులు కావస్తున్న నేటి వరకు రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కాలేదు అన్నారు. వానాకాలం సీజన్ లో కూడా రైతు భరోసా రాని రైతులు ఉన్నారని ఇప్పటివరకు మూడున్నర ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చారని రైతులందరికీ బోనస్ తో పాటు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు కనగాల కొండయ్య, మునగా రాంప్రసాద్, కొండ సురేష్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు………

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

తాగునీరు అందించేందుకు ప్రణాళికలో చేర్చాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

TNR NEWS

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో పోటెత్తిన భక్తులు

Harish Hs

ఈనెల 21, 22న దివ్యాంగులకు ఆటల పోటీలు: కె.వి. కృష్ణవేణి

TNR NEWS

ఘనంగా డా ఉమర్ ఆలీషా జన్మదిన వేడుకలు

Dr Suneelkumar Yandra

ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు…..  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్….

TNR NEWS

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Harish Hs