Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కలాం దేశానికి  చేసిన సేవలు చిరస్మరణీయం

భారత దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. ఆదివారం కలాం వర్ధంతి సందర్భంగా విజయీభవ ట్రస్ట్, స్వర్ణ భారతి ట్రస్ట్, ఇరుకుళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్రజ్ఞుడు అని రాష్ట్రపతిగా అన్ని వర్గాల ప్రజల మన్ననలను అందుకుని ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలామ్ అని అన్నారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలి అన్నారు.  ఈ కార్యక్రమంలో పైడిమర్రి వెంకటనారాయణ, ట్రస్ట్ సభ్యులు చారుగండ్ల రాజశేఖర్, యాదా సుధాకర్, పందిరి సత్యనారాయణ, వెంపటి వెంకటనారాయణ, వెంపటి ప్రసాద్, బండారు శ్రీనివాసరావు, గుడుగుంట్ల సాయి, పత్తి నరేందర్, మహంకాళి సత్యనారాయణ, స్వామి శ్రీనివాసరావు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు……….

Related posts

*పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి.*

Harish Hs

ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి…. అదనపు కలెక్టర్ డి.వేణు

TNR NEWS

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి

Harish Hs

అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి మతోన్మాదుల నుండి దేశాన్ని రక్షించుకోవాలి  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

TNR NEWS