Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గొర్రెల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి.  చనిపోయిన గొర్రెకు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.  జి *ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్

 

సూర్యాపేట: అంతుచిక్కని వ్యాధితో ఒకే రోజు 150 గొర్రెలు చనిపోయాయని, గొర్రెల మరణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చనిపోయిన గొర్రె కు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎం వి ఎన్ భవన్ లో జరిగిన తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం హనుమాన్ పల్లి కి చెందిన లింగప్ప, శివకుమార్ అనే గొర్రెల పెంపకం దారులు గత రెండు నెల క్రితం 20 లక్షల రూపాయలు పెట్టి 150 గొర్రెలను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అదే ప్రాంతానికి చెందిన ఇతరులతో కలిసి 1000 గొర్లతో వాటి మేత కోసం సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం విజయ రాఘవాపురం, రామసముద్రం గ్రామాలకు వలస రావడం జరిగిందన్నారు. అకస్మాత్తుగా సోమవారం సాయంత్రం గొర్రెలు అంతుచిక్కని వ్యాధితో మరణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు మృతి చెందిన గొర్రెలను పరిశీలించి చనిపోయిన కారణాలు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేసియా చెల్లించి గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జి ఎం పి ఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు వీరబోయిన రవి, జిల్లా ఉపాధ్యక్షులు కంచు గట్ల శ్రీనివాస్, గుండాల లింగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వజ్జా వినయ్, రాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులపై దాడులకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలి.  రైతాంగం పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి.  రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఎస్కేయం డిమాండ్

TNR NEWS

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు

Harish Hs

సీసీ కెమెరాలను ఏర్పాటుతో నేరాలు నియంత్రణ  – సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి  – బెల్ట్ షాపులు, గుడుంబా అమ్మకాలు పూర్తిస్థాయిలో నివారించాలి – వాహనాలకు ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు కలిగి ఉండాలి – పరకాల ఏసీబీ సతీష్ 

TNR NEWS

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

TNR NEWS

యువత స్వశక్తితో జీవితంలో రాణించాలి….. వినాయక బేకరీని ప్రారంభించిన మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్

TNR NEWS

కనుల పండువగా దేవాలయ వార్షికోత్సవం……..  జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం……..

TNR NEWS