Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గొర్రెల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి.  చనిపోయిన గొర్రెకు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి.  జి *ఎం పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్

 

సూర్యాపేట: అంతుచిక్కని వ్యాధితో ఒకే రోజు 150 గొర్రెలు చనిపోయాయని, గొర్రెల మరణాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి చనిపోయిన గొర్రె కు ఒక్కంటికి 15 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎం వి ఎన్ భవన్ లో జరిగిన తెలంగాణ గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లాలోని ధన్వాడ మండలం హనుమాన్ పల్లి కి చెందిన లింగప్ప, శివకుమార్ అనే గొర్రెల పెంపకం దారులు గత రెండు నెల క్రితం 20 లక్షల రూపాయలు పెట్టి 150 గొర్రెలను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అదే ప్రాంతానికి చెందిన ఇతరులతో కలిసి 1000 గొర్లతో వాటి మేత కోసం సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం విజయ రాఘవాపురం, రామసముద్రం గ్రామాలకు వలస రావడం జరిగిందన్నారు. అకస్మాత్తుగా సోమవారం సాయంత్రం గొర్రెలు అంతుచిక్కని వ్యాధితో మరణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు మృతి చెందిన గొర్రెలను పరిశీలించి చనిపోయిన కారణాలు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎక్స్గ్రేసియా చెల్లించి గొర్రెల కాపరులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జి ఎం పి ఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు వీరబోయిన రవి, జిల్లా ఉపాధ్యక్షులు కంచు గట్ల శ్రీనివాస్, గుండాల లింగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వజ్జా వినయ్, రాజుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మద్నూర్ లో ముగిసిన క్రికెట్ టోర్నమెంట్

TNR NEWS

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

TNR NEWS

తొర్రూర్ లో ‘విశ్వబ్రాహ్మణ వేదవిద్వాన్మహాసభ, పంచదాయిల ఆత్మీయ సమ్మేళనం’  విశ్వబ్రాహ్మణుల ఐక్యతను సమాజానికి చాటి చెప్పాలి  ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు , సంస్కృతి పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ పురోహితులు  సనాతన ధర్మ పరిరక్షణలో విశ్వబ్రాహ్మణ వేద పండితుల ప్రధాన పాత్ర : రామ గిరి విక్రమ్ శర్మ 

TNR NEWS

సిఐ గా పదోన్నతి పొందిన ఎస్సై రంజిత్ రెడ్డి

Harish Hs

మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి.  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS

మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారంతో మార్కెట్ అభివృద్ధికి కృషి

TNR NEWS