Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

జిల్లా అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నిక

పిఠాపురం : కాకినాడ జిల్లా నూతన బాక్సింగ్ అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం పిఠాపురం ఆర్.ఆర్.బిహెచ్.ఆర్.ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సర్వ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులందరూ పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్రకుమార్ ని సభ్యులందరూ ఏకగ్రీకంగా ఎన్నుకున్నారు. నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ బాక్సింగ్ క్రీడాకారుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాల అందిస్తాను అని అన్నారు. అనంతరం సభ్యులందరూ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నాగేంద్ర కుమార్ ను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సెక్రెటరీ రజిని, సభ్యులు కె.చిన్నబ్బాయి, జె.ప్రసాదరావు, పి.లక్ష్మణరావు, గణేష్, కృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాడా తాత్కాలిక భవన ఆధునీకరణ పనులు సకాలంలో పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి

సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో రూ.40 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ఘనంగా ఆదిత్యలో ఉదాన్ 11వ వార్షికోత్సవం

Dr Suneelkumar Yandra

పిఠాపురం వాసికి సివిల్స్లో 94వ ర్యాంకు

Dr Suneelkumar Yandra

సినీయర్‌ ఫిల్మ్‌ జర్నలిస్టులకు ‘‘స్వాతిముత్యం’’ సత్కారాలు

Dr Suneelkumar Yandra