క్రీడా పోటీలు మానసిక ఉల్లాసం కల్గిస్తాయని సీనియర్ సివిల్ జడ్జి కె సురేష్ అన్నారు.సోమవారంనాడు కోదాడ కోర్టులో ఆగస్టు 15న సందర్భంగా న్యాయవాదుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు తమ వృత్తి పని ఒత్తిడి లో ఉంటారని వారికి చెస్,క్యారమ్స్, షటిల్ లాంటి ఆటలు వారికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు.న్యాయవాదులు ఆటలు ద్వారా తమ ఒత్తిడి తగ్గించుకోవాలని,ఆటలు మానసిక,శారీరక దృఢత్వంకు,ఐక్యతకు దోహదం చేస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ch. లక్ష్మీనారాయణ రెడ్డి,కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, గేమ్స్ కార్యదర్శి బండారు రమేష్ బాబు,సీనియర్ న్యాయవాదులు వై. సుధాకర్ రెడ్డి,మేకల వెంకట్రావు, తమ్మినేని హనుమంతరావు,రంజాన్ పాషా,సాధు శరత్ బాబు,సిలివేరు వెంకటేశ్వర్లు,యశ్వంత్, ఈదుల.కృష్ణయ్య,కోడూరు వెంకటేశ్వర్లు, గోవర్ధన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.

previous post