Tnrnews.in
క్రైమ్ వార్తలుతెలంగాణ

నిమోనియ బారినపడి బాలుడు మృతి

నిమోనియా బారిన పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన గజ్వేల్ మండల పరిధిలోని దాతర్ పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన జూపల్లి బాలయ్య, సంతోష దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు ధనుష్ (8) అనే బాలుడు గత పది రోజులుగా నిమోనియాతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం బాలుణ్ణి మొదటగా గజ్వేల్ పట్టణంలోని ఏబీసీ ఆసుపత్రిలో, అనంతరం రెయిన్బో ఆసుపత్రిలో చూపించగా నిమోనియా తగ్గకపోవడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందాడు. కాగా బాలుడు గజ్వేల్ పట్టణంలోని గీతాంజలి పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రిల్ హీరో లను కాదు రియల్ హీరోలను ఆదర్శంగా తీసుకోవాలి

TNR NEWS

పార సీతయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం

Harish Hs

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు- ఎస్పీ నరసింహ

TNR NEWS

పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను విడుదల చేయాలి

Harish Hs

జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభం

TNR NEWS

ట్రాక్టర్ క్రేజ్ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS