Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

నిమోనియ బారినపడి బాలుడు మృతి

నిమోనియా బారిన పడి ఎనిమిదేళ్ల బాలుడు మృతిచెందిన సంఘటన గజ్వేల్ మండల పరిధిలోని దాతర్ పల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన జూపల్లి బాలయ్య, సంతోష దంపతులకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు ధనుష్ (8) అనే బాలుడు గత పది రోజులుగా నిమోనియాతో బాధపడుతున్నాడు. చికిత్స నిమిత్తం బాలుణ్ణి మొదటగా గజ్వేల్ పట్టణంలోని ఏబీసీ ఆసుపత్రిలో, అనంతరం రెయిన్బో ఆసుపత్రిలో చూపించగా నిమోనియా తగ్గకపోవడంతో నిలోఫర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతిచెందాడు. కాగా బాలుడు గజ్వేల్ పట్టణంలోని గీతాంజలి పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.

Related posts

లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కిన ఆర్ఐ

Harish Hs

పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవు

TNR NEWS

తాగునీటి కోసం తప్పని తిప్పలు  తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్

TNR NEWS

హైదరాబాద్: నేడు భారీ వర్షాలు

TNR NEWS

మద్దతు ధర కూడా రావట్లేదని వడ్లకి నిప్పు పెట్టిన రైతు

TNR NEWS

ఓపెన్ ఎస్ ఎస్ సి మరియు ఇంటర్ చేయదలచే విద్యార్థులకు మరో అవకాశం –  కోఆర్డినేటర్ దాసు

TNR NEWS