Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

న్యాయవాదుల పై దాడులను అరికట్టాలి

దేశంలో,రాష్ట్రంలో రోజురోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కే మూర్తి డిమాండ్ చేశారు. హైదారాబాద్ లో అడ్వకేట్ పై కత్తులతో దాడి చేసిన సంఘటనకు నిరసనగా బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న ప్రభుత్వాలు మాత్రం వారి రక్షణకు చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసారు. న్యాయవాదుల రక్షణకు సమగ్ర చట్టం రూపొందించి, దానిని అమలు చేయాలని, దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, కార్యవర్గం కోడూరు వెంకటేశ్వర రావు, హేమలత, దొడ్డ శ్రీధర్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Related posts

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి  మండల వ్యవసాయ అధికారి బి.రాజు

TNR NEWS

చలో హైదరాబాద్ కు తరలుతున్న ఆటో డ్రైవర్ల ముందస్తు అరెస్టు

TNR NEWS

*ట్రాఫిక్ నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలి : DSP జి.రవి.*  *సూర్యాపేట కొత్తబస్టాండ్ వద్ద సాయంత్రం సమయంలో ట్రాఫిక్ నియంత్రణను ఆకస్మికంగా తనిఖీచేసిన DSP రవి.*

TNR NEWS

అమ్మాపురం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు 

TNR NEWS

పెరిక హాస్టల్ అభివృద్ధికి కృషి చేయాలి

Harish Hs

జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘ ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి

TNR NEWS