భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్, కోదాడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావులు అన్నారు. బుధవారం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం దేశానికి అంకితం, యువతకు ఎన్నో మార్గదర్శకాలను దిశానిర్దేశం చేశాడని పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేశాడని సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు పరిచయం చేసింది రాజీవ్ గాంధీ అని రాజీవ్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పారా సీతయ్య, ఎర్నేని బాబు, సిహెచ్ శ్రీనివాసరావు, ధన మూర్తి,పాలూరి సత్యనారాయణ,డేగ శ్రీధర్, పంది తిరపయ్య, సైదా నాయక్, శ్రీనివాస్ యాదవ్, కాంపాటి శ్రీను, పిడత శ్రీను, నెమ్మది దేవమణి, కాంపాటి పుల్లయ్య,కొండల రెడ్డి, వీరారెడ్డి, బాల్ రెడ్డి, సూర్యనారాయణ, బాగ్దాద్, బాజన్, వెంకటేశ్వర్లు, బాబా,ముస్తఫా, దావల్,రజనీకాంత్, లైటింగ్ ప్రసాద్, శోభన్ తదితరులు పాల్గొన్నారు………