Tnrnews.in
తెలంగాణ

గత నాలుగు నెలల నుండి జీతాలు రాక పస్తులు ఉంటున్న ఫీల్డ్ అసిస్టెంట్ కుటుంబాలు

నడిగూడెం మండల ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలు గత నాలుగు నెలలుగా జీతాలు రాక పస్తులు ఉంటున్నాయని వెంటనే నిధులు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈరోజు జరిగిన ఫీల్డ్ అసిస్టెంట్లు సమావేశంలో బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని పనిలేని రోజులలో పేదవాడికి ఇంత అన్నం పెట్టి ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలని దురుద్దేశంతో సగం నిధులను రద్దుచేసిందని ఎంతో కష్టపడి పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు, సిబ్బందికి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందుల గురి చేస్తున్నారని ఫీల్డ్ అసిస్టెంట్ ల న్యాయమైన డిమాండ్్స1}ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనం 18000/ ఇవ్వాలి 2}4779 (జీవో ) సర్కులర్ ను రద్దు చేయాలి 3}తొలగించిన గ్రామాల్లో పీల్డ్ అసిస్టెంట్లు ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి 4 } కేటగిరి వ్యవస్థను రద్దు చేయాలి అందరికీ సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ కొరత శ్రీనివాస్ ఫీల్డ్ అసిస్టెంట్ మండల అధ్యక్షుడు కొరట్ల .వెంకటేశ్వర్లు, నక్క పద్మావతి,రెడ్డి సులోచన, నెమ్మది సుధాకర్,ఎస్.కె మాసంబీ, ఆదిలక్ష్మి,విజయ,వెంకన్న, సీతారాం రెడ్డి,వీరాంజనేయులు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రజావాణికి 120 ఫిర్యాదులు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి. జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్.

TNR NEWS

అమ్మాపురంలో రైతు దినోత్సవం  రైతు దినోత్సవం రోజు రైతులకు సన్మానం 

TNR NEWS

సుప్రీంకోర్టు స్టేను స్వాగతిస్తున్నాం…. హెచ్‌సీయు భూములను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించొద్దు….  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి 

TNR NEWS

మదర్ థెరిసా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

Harish Hs

డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువత పని చేయాలి

TNR NEWS

కొడంగల్‌ను ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చనున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

TNR NEWS