Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలి. -బీవీహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్

మోతె, అక్టోబర్ 22 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో వికలాంగులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి అర్హులైన వికలాంగుల అందరికీ ఇల్లు మంజూరు చేసేలా కృషి చేయాలని మోతె మండలం ఎమ్మార్వో వెంకన్న కి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక మోతె మండల తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో వెంకన్న ని సంఘం నేతలతో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఎమ్మార్వో వెంకన్న ను శాలువాతో ఘనంగా సత్కరించి మండలంలో వికలాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రాతిపదికన వికలాంగులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేసిన అనంతరం వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మార్వో వెంకన్న దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా సమాజంలో వివక్షకు గురి అవుతూ ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదుర్కొంటున్న వికలాంగుల సామాజిక వర్గానికి అండగా నిలబడాలని వికలాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చే సంక్షేమ పథకాలను అర్హులైన వికలాంగులకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజీరాల సుధాకర్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, ఎమ్మార్పీఎస్ మోతె మండల అధ్యక్షులు బైరు పంగు విజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు బోర్ర సునీల్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం జిల్లా నాయకులు జిల్లపల్లి శివకృష్ణ, సంఘం నాయకులు బొల్లం లింగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS

మహాత్మగాంధీని మరోసారి హత్య చేసిన కేంద్ర బిజెపి ప్రభుత్వం  మునగాల మండలం నరసింహుల గూడెం   జిల్లా కమిటీ సభ్యురాలు, గ్రామ కార్యదర్శి……

TNR NEWS

ఆపదలో అండగా బీమా

TNR NEWS

ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంకు బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలి

Harish Hs

మారేడుమిల్లి ఘటనపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి  పౌర హక్కుల సంఘం

TNR NEWS

సంక్షోభంలో ఉన్న రవాణా రంగాన్ని ఆదుకోవాలి…..  రవాణా రంగ సమస్యలపై పార్లమెంటులో చర్చించాలి….  మాజీ సీఎం, ప్రస్తుత ఎంపీ బిప్లబ్ కుమార్ దేవ్ కు వినతి పత్రం అందజేత..  తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు

TNR NEWS